యాక్సిడెంట్ తర్వాత రెట్టించిన వేగంతో సాయితేజ్

సాయితేజ్ .. రెండు నెలల క్రితం బైక్ యాక్సిడెంట్ లో గాయపడ్డాడు. మొదట సీరియస్ అనుకున్నారు కానీ.. క్షేమంగా బయటపడ్డాడు. కాకపోతే కాస్త ఎక్కువ రోజులే హాస్పిటల్ లో ఉన్నాడు. ఫైనల్ గా అతను పూర్తిగా కోలుకుని ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడిప్పుడు. ఇక వీలైనంత త్వరగా పనిలో పడితే అంతా సెట్ అయిపోతుంది. అందుకే ఈ సారి మరింత కాన్ఫిడెంట్ గా రాబోతున్నాడు. అతని రిపబ్లిక్ సినిమా విడుదల కావడానికి పదిరోజులు ముందు యాక్సిడెంట్ కు గురయ్యాడు. దీంతో అంతా సినిమా వాయిదా పడుతుందనుకున్నారు. బట్ చెప్పిన టైమ్ కే వచ్చింది. క్రిటిక్స్ ప్రశంసించారు కానీ.. కమర్షియల్ గా ఈ మూవీ మరీ అంత గొప్పగా ఏం లేదు. అటు ఓటిటిలో సైతం విమర్శకుల చేత ప్రశంసలు అందుకుందీ చిత్రం.
ఇక తను ఆల్రెడీ ఒప్పుకుని కొంత షూట్ చేసిన సినిమా పెండింగ్ లో ఉంది. ముందు ఆ చిత్రాన్ని ఫినిష్ చేస్తాడు సాయితేజ్. ఆ తర్వాత తనతో చిత్రలహరి మూవీ రూపొందించిన మైత్రీ మూవీస్ బ్యానర్ లో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం చేస్తుండటం విశేషం. ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయిపోయిందట. అయితే ఆల్రెడీ కార్తిక్ దండు డైరెక్షన్ లో చేస్తోన్న ఓ మిస్టీరియస్ థ్రిల్లర్ ను పూర్తి చేసిన తర్వాతే సంపత్ నంది, మైత్రీ బ్యానర్ లో ఎంటర్ అవుతాడు సాయితేజ్. మొత్తంగా మైత్రీ మూవీస్ అంటే మాగ్జిమం గ్యారెంటీ కదా. పైగా సంపత్ కూడా రీసెంట్ గా గోపీచంద్ తో చేసిన సీటీమార్ తో ఫామ్ లోకి వచ్చాడు. సో.. ఇక సాయితేజ్ దూకుడు మొదలవుతుందన్నమాట.

Related Posts