పవన్ కళ్యాణ్ లైనప్ పెరుగుతూనే ఉంది..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడుకు టాలీవుడ్ ఆశ్చర్యపోతోంది. ఇప్పటికే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ లేటెస్ట్ గా మరో ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు అంటున్నారు. పైగా నిర్మాణ సంస్థ నుంచే ఈ వార్తలు వస్తుండటంతో అంతా నిజమే అనుకుంటున్నారు. ప్రస్తుతం భీమ్లా నాయక్ ను ఫినిష్ చేసి ఉన్నాడు పవన్ కళ్యాణ్. తర్వాత క్రిష్ డైరెక్షన్ లో రూపొందే హరిహరవీరమల్లు చిత్రాన్ని పూర్తి చేస్తాడు. రీసెంట్ గా స్క్రిప్ట్ లో పవన్ చెప్పిన కొన్ని మార్పులను పూర్తి చేసి మళ్లీ నెరేట్ చేశాడు క్రిష్. అతను ఓకే చెబితే ఈ చిత్రం జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళుతుంది. పీరియాడిక్ ఫిక్షన్ గా వస్తోన్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నాడు. నిధి అగర్వాల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీని లేటెస్ట్ గా మరో పాత్రకు తీసుకున్నారు.


ఇక ఆ తర్వాత హరీశ్ శంకర్ డైరెక్షన్ లో భవదీయుడు భగత్ సింగ్ అనే చిత్రం కూడా రావాల్సి ఉంది.ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకుని పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూస్తోంది. హరిహరవీరమల్లుతో పాటు హరీష్ కూ డేట్స్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు చాలామంది. అలాగే సురేందర్ రెడ్డి డైరెక్షన్ లోనూ సినిమా అనౌన్స్ అయింది. ఇలా మూడు సినిమాలు చేయాల్సి ఉండగా ఇప్పుడు మరో చిత్రం కూడా చేయబోతున్నాడనే వార్త నిజంగానే ఆశ్చర్యపరుస్తోంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో జె భగవాన్ పుల్లారావు నిర్మాణ సారథ్యంలో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఉంటుందనే ప్రచారం మొదలైంది. ఇది నిజమే అంటున్నారు. రేపు లేదా క్రిస్మస్ కు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట. ప్రస్తుతం వినిపస్తోన్న దాన్ని బట్టి.. తమిళ్ లో సముద్రఖని డైరెక్షన్ లో వచ్చిన ఓ చిత్రాన్ని పవన్ రీమేక్ చేయబోతున్నాడు అంటున్నారు. ఈ మూవీలో పాటలుండవు. చిత్రీకరణ కూడా తక్కువ లొకేషన్స్ లోనే తక్కువ రోజుల్లోనే పూర్తయ్యేలా ఉంటుంది. అందుకే ఈ చిత్రాన్ని ఎంచుకున్నాడు అంటున్నారు. ఏదేమైనా పవన్ ఇప్పుడు క్రిస్మస్ కు అత్తగారి దేశం రష్యా వెళుతున్నాడు. రాగానే ఈ ప్రాజెక్ట్స్ కు సంబంధించి ఓ కీలకమైన అప్డేట్స్ వస్తాయనుకోవచ్చు.

Related Posts