బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించిన దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని దాదాపుగా 450 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించారు. అయితే.. బిజినెస్ పరంగా చరిత్రను తిరగరాసింది. ఏకంగా 890 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ స్థాయిలో ఓ తెలుగు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం టాలీవుడ్ సినీ హిస్టరీలోనే తొలిసారి కావడం విశేషం.
ఈ సంచలన చిత్రాన్ని భారీ అంచనాల మధ్య జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 14 భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు కానీ.. అనూహ్యంగా మారిన పరిస్థితులు.. పెరిగిన ఒమిక్రాన్ కరోనా కేసులు… కారణంగా పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు అమల్లోకి వచ్చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టుగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించేసింది.
ఇదిలా ఉంటే… ప్రేక్షకులకు రాజమౌళి ఓ సర్ ఫ్రైజ్ ని సిద్ధం చేశాడట. అది ఏంటంటే.. ఈ మూవీ కోసం ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట. ఈ పాటని సైలెంట్ గా రామ్ చరణ్ ఎన్టీఆర్ లపై కొన్ని వారాల క్రితమే చిత్రీకరించారని సమాచారం. ఆ పాట ఎలా ఉంటుందంటే.. మగధీర ఎండ్ టైటిల్స్ లో టీమ్ మెంబర్స్ అందరితో కలిసి ఏర్పాటు చేసినట్టుగా ఆర్ఆర్ఆర్ సినిమా ముగింపులో వస్తుందని అయితే.. ఈ పాటలో కేవలం రామ్ చరణ్ ఎన్టీఆర్ మాత్రమే వుంటారని టాక్. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.