మెగా హీరోల‌తో సినిమాలు ప్లాన్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూస‌ర్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల క్రేజీ కాంబినేష‌న్లో.. భారీ చిత్రాల నిర్మాత డివివి దాన‌య్య ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నిర్మించిన విష‌యం తెలిసిందే. ఈ భారీ క్రేజీ మూవీ మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. యూఎస్ ప్రీమియ‌ర్స్ కి రికార్డు స్థాయిలో టిక్కెట్లు సేల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్ కి 15 రోజుల ముందే అక్క‌డ 1 మిలియ‌న్ మార్క్ దాటి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత భారీ చిత్రాల నిర్మాత దాన‌య్య‌ వరుసగా సినిమాలను నిర్మిచేందుకు ప్లాన్ చేస్తున్నారట. అది కూడా మెగా హీరోలతో అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, వెంకీ కుడుముల కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం చేయ‌నున్నట్టుగా అధికారికంగా ప్ర‌క‌టించారు. త్వరలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకురానున్నారు. ఇక రామ్ చరణ్ తో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నిర్మించిన‌ దాన‌య్య ఆయ‌న‌తో మ‌రో సినిమా ప్లాన్ చేస్తున్నారు.

ఈసారి చ‌ర‌ణ్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్లో భారీ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. ఇవి మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమాను నిర్మిస్తారట. దీనిని తెరి చిత్రానికి రీమేక్‌గా రూపొందించనున్నట్టు, త్రివిక్రమ్ సంభాష‌ణ‌లు – స్క్రీన్ ప్లే అందించనున్నారని సమాచారం. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ త్వ‌ర‌లో రానుంది. ఇలా.. మెగా హీరోల‌తో ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూస‌ర్ దాన‌య్య వ‌రుస‌గా సినిమాలు ప్లాన్ చేస్తుండ‌డం విశేషం.

Related Posts