మ‌హేష్‌, బాల‌య్య కాంబినేష‌న్లో రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్ నిజ‌మేనా..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రానుంద‌ని గ‌త కొంత కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్రేజీ మూవీ కోసం మ‌హేష్ బాబు అభిమానులు ఎప్ప‌టి నుంచో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. క‌రోనా ఫ‌స్ట్ వేవ్ టైమ్ లో రాజ‌మౌళి ఓ న్యూస్ ఛాన‌ల్ కి ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో… ఆర్ఆర్ఆర్ త‌ర్వాత మ‌హేష్ బాబుతో సినిమా చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. అప్ప‌టి నుంచి ఈ ప్రాజెక్ట్ పై మ‌రింత క్యూరియాసిటీ పెరిగింది.

అయితే… ఈ సినిమాలో ఓ సీనియ‌ర్ హీరో న‌టించేందుకు ఓ ప‌వ‌ర్ ఫుల్ రోల్ ఉంద‌ని.. ఈ పాత్ర దాదాపు 40 నిమిషాలు ఉంటుంద‌ని టాక్ వ‌చ్చింది. ఆత‌ర్వాత ఆ పాత్ర‌ను న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ పోషించ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త ఇండ‌స్ట్రీలో వైర‌ల్ గా మారింది. దీని పై ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కానీ.. ర‌చ‌యిత‌ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ కానీ స్పందిచంలేదు. అయితే… ఇటీవ‌ల బాల‌య్య అన్ స్టాప‌బుల్ టాక్ షోలో రాజ‌మౌళి పాల్గొన్న‌ప్పుడు నాతో సినిమా ఎప్పుడు అని రాజ‌మౌళిని బాల‌య్య అడ‌గ‌డం జ‌రిగింది.

ఇప్పుడు మ‌హేష్‌, రాజ‌మౌళి మూవీలో బాల‌య్య అని జోరుగా వార్త‌లు వ‌స్తుండ‌డంతో.. ఈ వార్త వాస్త‌వ‌మే అని బ‌లంగా వినిపిస్తోంది. అటు మ‌హేష్‌, ఇటు బాలయ్య ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇప్పుడు వీరిద్ద‌రు క‌లిసి సినిమా చేస్తే.. దానికి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి డైరెక్ట‌ర్ అయితే.. ఆ సినిమాకి క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఈ వార్త వాస్త‌వం కావాల‌ని.. అటు మ‌హేష్ అభిమానులు, ఇటు బాల‌య్య అభిమానులు కోరుకుంటున్నారు. అయితే.. ఈ క్రేజీ కాంబినేష‌న్ పై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Posts