పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన భారీ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు యువి క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా.. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. కరోనా కారణంగా చాలా సార్లు వాయిదా పడిన రాధేశ్యామ్ మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే… ఫస్డ్ డే ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లో మిశ్రమ స్పందన వచ్చింది. అయినప్పటికీ.. రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేయడం విశేషం. ఇంతకీ ఎంత కలెక్ట్ చేసిందంటే.. ఈ కరోనా ప్యాండమిక్ అనంతరం భారీ స్థాయిలో మొదటి రోజు 79 కోట్ల గ్రాస్ ని అందుకున్న సినిమాగా రాధే శ్యామ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫిసియ ల్ గా అనౌన్స్ చేశారు. దీంతో ఫస్ట్ వీకెండ్ ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది.
ఇక బాలీవుడ్ రిపోర్ట్ ఏంటంటే.. బాహుబలి 2 తర్వాత వచ్చిన సాహో ఆడలేదు కానీ ఓపెనింగ్స్ విషయంలో మాత్రం రికార్డులు సృష్టించింది. ఒక్క హిందీ వర్షెన్ ఇండియాలో దాదాపు 25 కోట్ల రూపాయల ఓపెనింగ్ తెచ్చింది మొదటి రోజు. ఫుల్ రన్ లో బాలీవుడ్ లో సాహో 100 కోట్లు కలెక్ట్ చేసింది. దాంతోనే ప్రభాస్ స్టార్ పవర్ ఏంటో అందరికీ అర్థం అయింది. అందుచేత రాధే శ్యామ్ కూడా చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ రాబడుతుంది అనుకున్నారు.
ఇంకా చెప్పాలంటే.. తెలుగులో కన్నా హిందీలోనే ఇది బాగా ఆడుతుందని భావించారు. అయితే.. రాధేశ్యామ్ కి బాలీవుడ్ లో మొదటి రోజు నాలుగున్నర, అయిదు కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే రావడం నిజంగా షాకే అని చెప్పచ్చు. ఇలా ఎందుకు జరిగిందంటే.. అక్కడ కూడా ఇప్పుడు మాస్ సినిమాలనే కోరుకుంటున్నారు. ఈ కారణం చేతనే రాధేశ్యామ్ కి బాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదంటున్నారు సినీ పండితులు.