నేడు(30.11.2023) తెలంగాణలో పోలింగ్

నేడు(30.11.2023) తెలంగాణలో పోలింగ్. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు జూనియర్ ఎన్.టి.ఆర్ తన భార్య లక్ష్మీ ప్రణి తల్లి శాలినీతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, అల్లు అర్జున్, దర్శకుడు తేజ, నటులు శివాజీ రాజా, ఝాన్సీ, రానా దగ్గుబాటి, శ్రీకాంత్ ఫ్యామిలీ, సీనియర్ దర్శకులు కె రాఘవేంద్ర రావు, సూపర్ స్టార్ మహేశ్ బాబు సహా పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సికింద్రాబాద్.. సనత్ నగర్ నియోజకవర్గం పద్మారావు నగర్ లోని తుంగభద్ర మహిళ సంఘం లోని పోలింగ్ బూత్ నంబర్ 85లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ సందర్భంగా ఆయన సెలవుదినంగా భావించకుండా ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. విద్యార్థులు యువత ఓటింగ్ లో పాల్గొనాలని కోరారు.

Related Posts