పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ కావాలట

స్టార్ హీరోల రెమ్యూనరేషన్స్ ఆకాశంలో ఉంటున్నాయని అందరికీ తెలుసు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఇదే ట్రెండ్ ఉంది. సినిమాలు ఆడినా ఆడకున్నా.. వారికి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ మాత్రం ఖచ్చితంగా చెల్లించాల్సిందే. కొందరైతే రెమ్యూనరేషన్స్ తో పాటు కొన్ని ఏరియాల హక్కులు కూడా తీసుకుంటారు. అలాగే తమ బ్యానర్ ను నిర్మాణ భాగస్వామిగా చేసి లాభం వస్తే తీసుకుంటారు. నష్టం వస్తే తప్పుకుంటారు.

ఇక ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు గుంటూరు కారం కోసం 78 కోట్లు రెమ్యూనేషన్ తీసుకుంటున్నాడు అంటున్నారు. ప్రభాస్ గురించి మనం మాట్లాడలేం. ఆయన ఏకంగా 150 కోట్లు తీసుకుంటున్నాడు ఒక్కో సినిమా కోసం.

ఇలా రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి వారు 35 -50 కోట్ల మధ్య ఉన్నారు. అయితే వీరికి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు అని కాకుండా ఒక్కో రోజుకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. ఆయన రెమ్యూనరేషన్ రోజుకు రెండు కోట్లు. ఎన్ని రోజులు షూటింగ్ ఉంటే అంత రెమ్యూనరేషన్.దీని వల్ల తన పొలిటికల్ టూర్స్ కు ఇబ్బంది ఉండదు అనేది పవన్ వెర్షన్. అయితే ఇప్పుడు ఓ మళయాల నటుడు పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అడుగుతున్నాడు. అతనూ రోజుల్లోనే తీసుకుంటా అంటున్నాడు. కాకపోతే రోజుకు 5 కోట్లు కావాలట.


మళయాల మెగాస్టార్ గా తిరుగులేని క్రేజ్ ఉన్న మమ్మూట్టి తెలుగు ఆడియన్స్ కు కూడా ఫేవరెట్ యాక్టర్. ఒకప్పటి స్వాతి కిరణం నుంచి రీసెంట్ గా వచ్చిన యాత్ర వరకూ ఆయన సినిమాలను మనవాళ్లు ఆదరించారు. యాత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన సినిమా. ఆ పాత్రలో మమ్మూట్టి అచ్చంగా ఒదిగిపోయాడు. నటనతో పాటు డిక్షన్ కూడా బాగా పలికించాడు.మహి వి రాఘవ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కమర్షియల్ గానూ బాగా ఆకట్టుకుంది.


ఇక ఇదే రాఘవ ఇప్పుడు వైఎస్ జగన్ పాదయాత్ర నేపథ్యంలో యాత్ర2 అనే చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడు.శివ మేక నిర్మిస్తోన్న ఈ చిత్రా్ని రీసెంట్ గానే అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాలో ఆయన తండ్రి పాత్రను కూడా చూపించాలనుకుంటున్నాడు.

ఇందుకోసం మమ్మూట్టినే అడిగాడట. కేవలం రెండు రోజుల షూటింగ్ మాత్రమే ఉంటుందని చెప్పాడట. అయితే రెండు రోజులకు 10 కోట్లు ఇవ్వమని అడిగాడట మమ్మూట్టి.ఆ అమౌంట్ వినగానే నిర్మాత షాక్ అయ్యాడట.

వీళ్లు బడ్జెట్ కంట్రోల్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నారు. మరి రెండు రోజుల పాత్రకే పది కోట్లు ఇస్తే ఇంకేమన్నా ఉందా..? పోనీ వేరే నటుడుని తీసుకోవాలనుకుంటే ఆల్రెడీ వైఎస్ఆర్ అంటే తెలుగువాళ్లకు తనే గుర్తొచ్చేలా చేసుకున్నాడు మమ్మూట్టి. అందుకే ప్రస్తుతం ఆయన్నే కాస్త తక్కువ అమౌంట్ కు చేసేలా కన్విన్స్ చేస్తున్నారట. చేస్తాడా లేదా అనేది ఇంకా కన్ఫార్మ్ కాలేదు.మొత్తంగా మమ్మూట్టి మనోళ్ల వీక్ పాయింట్ గట్టిగానే పట్టుకున్నాడు.

Related Posts