గుంటూరు కారం.. తమన్ కూడా అవుట్

గుంటూరు కారం కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే సినిమా షూటింగ్ నత్త నడకన సాగుతోంది. దీనికి తోడు ఒక్కో టెక్నీషియన్ సినిమా నుంచి తప్పుకుంటున్నారు. ఈ మొత్తానికి కారణం మహేష్ బాబే అని ఇండస్ట్రీ మొత్తం చెప్పుకుంటోంది. ఆయన నిర్లక్ష్యం వల్లే సినిమా షూటింగ్ లేట్ అవుతోంది.. రోజుల్లో కాదు.. నెలల తరబడి వాయిదా పడుతూనే వస్తోంది.

దీంతో ఆల్రెడీ వేరే కమిట్మెంట్స్ ఉన్న టెక్నీషియన్స్ అంతా ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ లోనే భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తీసిన అన్బురివ్ ను తప్పించాడు మహేష్ బాబు.ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో మహేష్ ఫిజికల్ గా బాగా స్ట్రెయిన్ అయ్యాడట. అందుకే వద్దన్నాడు. అతని ప్లేస్ లో అనిల్ అరసును తెచ్చాడు త్రివిక్రమ్. ప్రస్తుతం ఈయనే ఉన్నాడు.


త్రివిక్రమ్ తో బాగా ట్యూన్ అయిన సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ కూడా రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. ఆ ప్లేస్ లో మహేష్ టీమ్ సూచన మేరకు రవి కే చంద్రన్ ను తీసుకున్నారు.

ఇక లేటెస్ట్ గా మరో భారీ మార్పు చేస్తున్నట్టు టాక్.కొన్నాళ్లుగా త్రివిక్రమ్ తో తమన్ కు బాగా ట్యూన్ అయింది. ఆ ట్యూన్ ను తుంచేయబోతున్నారు అంటున్నారు. అది కూడా హీరోగారి ఒత్తిడి మేరకే అనే టాక్ కూడా ఉంది. ప్రస్తుతం వినిపిస్తున్నదాన్ని బట్టి తమన్ ను రీ ప్లేస్ చేయబోతున్నారట.

అయితే ఈ ప్లేస్ లో అనిరుధ్ ను తీసుకుందాం అని త్రివిక్రమ్ టీమ్ ప్రతిపాదన చేస్తే మహేష్ టీమ్ మాత్రం హేషమ్ అబ్దుల్ వాహబ్ ను తీసుకోవాలని హీరోగారు చెప్పారని చెబుతున్నారు.


హేషమ్ అబ్దుల్ వాహబ్ ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ, సమంతల ఖుషీ సినిమాతో పరిచయం అవుతున్నాడు. నెక్ట్స్ నాని హీరోగా వస్తోన్న హాయ్ నాన్నతో పాటు శర్వానంద్ సినిమాకీ అతనే సంగీత దర్శకుడు. ఖుషీ నుంచి వచ్చిన రెండు పాటలు ఆకట్టుకున్నాయి.అతన్నే తీసుకోవాలని మహేష్ అండ్ టీమ్ త్రివిక్రమ్ పై ఒత్తిడి చేస్తోందట. ఇక ఇప్పటికే ఆర్టిస్టుల్లో పూజాహెగ్డే తప్పుకుంది. ఇంకా చాలామంది క్యారెక్టర్స్ కూడా రీ ప్లేస్ అయ్యారని చెబుతున్నారు. ఏదేమైనా ఒక స్టార్ హీరో సినిమాకు ప్రారంభమైన తర్వాత ఇన్ని మార్పులు చేయడం ఇదే మొదటిసారిలా కనిపిస్తోంది. అసలు మహేష్ మనసులో ఏముందో కానీ.. గుంటూరు కారం సినిమా వారిని మాత్రం ముప్పుతిప్పలు పెడుతున్నాడు అంటున్నారు.

Related Posts