Sharwanand : ఇంటివాడైన శర్వానంద్

శర్వానంద్ టాలీవుడ్‌లో మోస్ట్ ప్రామిసింగ్ నటులలో ఒకరు. ఇన్నాళ్లూ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న శర్వా తాజాగా ఒక ఇంటి వాడు అయ్యాడు.. ఈ యేడాది ప్రారంభంలో, జనవరి 26 న, రక్షిత రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు. మధ్యలో వీరి పెళ్లికి సంబంధించి కొన్ని రూమర్స్ కూడా రావడం విశేషం. బట్ వాటిని ఖండించడమే కాదు తన పెళ్లి గురించిన అఫీషియల్ న్యూస్ ను కూడా అప్పుడు షేర్ చేసుకున్నాడు.


ఇక జూన్ 3న రాత్రి 11 గంటలకు, జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో పెళ్లి చేసుకున్నాడు శర్వానంద్. ఇది డెస్టినేషన్ మ్యారేజ్ కావడంతో తక్కువమంది సన్నిహితుల మధ్యే వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి సన్నిహిత కుటుంబాలు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ , రానా దగ్గుబాటి హాజరయ్యారు.

ఇక జూన్ 9న హైదరాబాద్‌లో టాలీవుడ్‌ తో పాటు ఇతర ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కు గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేశాడు శర్వానంద్. ఇక శర్వా పెళ్లి చేసుకున్న రక్షిత రెడ్డి హైకోర్టు న్యాయవాది మధుసూధన్ రెడ్డి కుమార్తె. అలాగే టీడీపీ మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మనవరాలు.

Related Posts