మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే.. రామ్ చరణ్.. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇది చరణ్ 15వ చిత్రం, దిల్ రాజు 50వ చిత్రం కావడం విశేషం.
ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తుంటే… శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే… ఇంటెన్స్ యాక్షన్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ డబుల్ రోల్ చేస్తున్నారనే ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ రెండు పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తిగా మారింది.
ఇందులో చరణ్ ఒక లుక్ లో బ్యూరోక్రాట్ గా కనిపిస్తే.. మరో లుక్ లో క్యాజువల్ లుక్ లో కనిపించనున్నాడని సమాచారం. ఈ రెండు పాత్రలు చాలా డిఫరెంట్ గా ఉంటాయని.. ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఇందులో చరణ్ డబుల్ రోల్ చేస్తున్నాడనే విషయాన్ని మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. చరణ్ డబుల్ రోల్ చేస్తున్నాడనేది వాస్తవమే అని టాలీవుడ్ లో టాక్ గట్టిగానే వినిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది. ఈ భారీ పాన్ ఇండియా మూవీని 2023 సంక్రాంతికి భారీ స్ధాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.