టాలీవుడ్ లో మళ్లీ లీకుల బెడద మొదలైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట సినిమా నుంచి కళావతి సాంగ్ లీకు అవ్వడంతో మేకర్స్ షాక్ అయ్యారు. ఈ సాంగ్ ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పిబ్రవరి 14న రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. ఈ సాంగ్ లీకవ్వడంతో ఒక రోజు ముందుగానే ఈ పాటను రిలీజ్ చేయాల్సివచ్చింది. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ కాదు… మైత్రీ మూవీ లీకర్స్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రొడక్షన్ హౌస్ పై మండిపడుతున్నారు.
ఇక ఈ చిత్రానికి సంగీతం అందించిన సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ అయితే… తన హృదయం బద్దలైంది అంటూ తన ఆవేదన అంతా ట్విట్టర్ లో తెలియచేశారు. టీమ్ అంతా ఎంతో కష్టపడి చేసిన పాట ఇలా లీకవ్వడం అంటే.. చాలా బాధగా ఉంది. నేను చాలా స్ట్రాంగ్ గా ఉంటాను కానీ.. ఈ పాట లీకవ్వడం అనేది మాత్రం తట్టుకోలేకపోతున్నాను అన్నారు. ఇలా ఇంకోసారి జరగకూడదు. ఎవరైతే లీక్ చేసారో వాళ్లకి మా బాధ అర్ధం అవ్వాలి అందుకనే సోషల్ మీడియాలో ఇలా స్పందిస్తున్నాను అని చెప్పారు తమన్.
మహేష్ బాబు సర్కారు వారి పాట లీకు అవ్వడమే ఓ షాక్ అనుకుంటే… ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ నుంచి కూడా లీకు అవ్వడం మరో షాక్ అని చెప్పచ్చు. టైటిల్ సాంగ్ లోడింగ్ అంటూ ఊరించిన భీమ్లా నాయక్ నిర్మాతలకు ఇప్పుడు ఎదురు దెబ్బ తగిలింది. భీమ్లా నాయక్ పాటలోని ఒక డ్యాన్స్ బిట్