నేను శైలజ, నేను లోకల్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది కీర్తి సురేష్. మంచి గుర్తింపు ఏర్పరుచుకుంది. అయితే.. మహానటి సినిమాలో అలనాటి నటి సావిత్రిగా నటించి మెప్పించింది. జాతీయ అవార్డ్ సైతం దక్కించుకుంది. దీంతో కీర్తి సురేష్ కి బాగా డిమాండ్ పెరిగింది. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ దూసుకెళుతుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుంది. అలాగే నేచురల్ స్టార్ నానితో కలిసి దసరా అనే చిత్రంలోను నటిస్తుంది.
ఇదిలా వుంటే కీర్తి తమిళ స్టార్ ఇళయదళపతి విజయ్ చిత్రంలో నటిస్తోందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. విజయ్ ప్రస్తుతం బీస్ట్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీ తరువాత వంశీ పైడిపల్లి చిత్రంలో విజయ్ నటించనున్నారు. విజయ్ 66వ ప్రాజెక్ట్ గా సెట్స్ పైకి రానున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కొన్ని నెలల క్రితమే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు కానీ.. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ..అనేది ఇంకా ప్రకటించలేదు.
అయితే ఈ సినిమాలో విజయ్ సరసన కీర్తి సురేష్ నటించనున్నట్టుగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తమ సినిమాలో కీర్తి సురేష్ నటించడం లేదని హీరో విజయ్ అఫీషియల్ టీమ్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా తెలియచేశారు. మరి.. ఈ భారీ చిత్రంలో విజయ్ సరసన నటించే ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.