యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయనున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే… ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
కారణం ఏంటంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఫిక్స్ అయ్యిందని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. ఆతర్వాత అతిలోకి సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ ని ఫిక్స్ చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు కైరా అద్వానీ కాదు.. జాన్వీ కపూర్ కాదు.. ఆలియా భట్ ని ఫిక్స్ చేశారని టాలీవుడ్ లో గట్టిగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీంతో ఎన్టీఆర్, కొరటాల మూవీలో హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉన్నప్పటికీ.. బాలీవుడ్ బ్యూటీ ఆలియా పేరు మాత్రం గట్టిగా వినిపిస్తోంది. అయితే… ఎన్టీఆర్ కానీ.. కొరటాల కానీ.. ప్రచారంలో ఉన్న వార్తల గురించి స్పందించడం లేదు. త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.