సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాలి కానీ.. కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకుంటున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఈ క్రేజీ మూవీలో మహేష్ బాబు సిస్టర్ గా ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటించనున్నాదని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో సిస్టర్ పాత్ర కీలకమని.. ఆ పాత్రకు సాయిపల్లవిని ఫిక్స్ చేశారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ సిస్టర్ గా సాయి పల్లవి నటిస్తే.. నిజంగానే కాంబినేషన్ అదిరిపోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం సాయి పల్లవి హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉంది.
కాగా ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. అయితే.. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా కనిపించబోతుందట. ఏప్రిల్ నుంచి షూట్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ముందుగా మహేష్ పై సోలో సాంగ్ ను అలాగే ఒక ఫైట్ ను తీస్తారని తెలిసింది. ఇక పదకొండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే… ఈ సినిమాలో సాయిపల్లవి సిస్టర్ క్యారెక్టర్ చేయడం నిజమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.