ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట. దర్శకథీరుడు రాజమౌళికి సినిమాని ఎంత బాగా తీయాలో తెలియడమే కాదు.. తీసిన సినిమాని ఎంత బాగా ప్రమోట్ చేయాలి.? జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలో బాగా తెలుసు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అందుకనే రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్.. కలిసి నార్త్ లో బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఫుడ్ ఛాలెంజ్ లో కూడా పాల్గొన్నారు.
అయితే.. ఆ ఫుడ్ ఛాలెంజ్ లో ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించి విశేషాలు చెబుతూనే.. తనకిష్టమైన ఆహార పదార్థాల గురించి కూడా చరణ్ చెప్పుకొచ్చాడు. ఈ పొగ్రామ్ లో చిరంజీవి దోశ గురించి చరణ్ చెబుతూ…మా ఇంట్లో ఫేమస్ అయిన చిరు దోశ గురించి అందరికీ తెలుసు. అయితే.. ఆ దోశలో ఏయే పదార్థాలు ఉపయోగిస్తారో నాకు ఇప్పటి వరకు తెలియదు. మా అమ్మ కూడా నాకు ఎప్పుడూ చెప్పలేదు. కానీ.. ఆ దోశ బాగా టేస్ట్ గా ఉంటుంది అని చెప్పారు.
ఇక తనకు ఇష్టమైన వంటకాల గురించి చెబుతూ.. నేను స్వీట్స్ కంటే కారంగా ఉండేవే ఎక్కువ తింటాను. మా ఇంట్లో ఎక్కువగా స్పైసీ ఐటమ్స్ తినేది నేనే. అలాగే నేను మాంసాహారం కంటే శాకాహారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. అదే విధంగా హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా ఇష్టం అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు.