‘డబుల్ ఇస్మార్ట్‘ టీమ్ లోకి మణిశర్మ ఎంట్రీ

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్, మెలోడీ బ్రహ్మ మణిశర్మ కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్‘ ఘన విజయాన్ని సాధించింది. పూరి టేకింగ్, రామ్ యాక్టింగ్ కి దీటుగా ఈ సినిమాలో మణిశర్మ మ్యూజిక్ వర్కవుట్ అయ్యింది. ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్టయ్యాయి. ‘ఇస్మార్ట్ శంకర్‘ తర్వాత మణిశర్మ మళ్లీ ఫుల్ బిజీ అయిపోయాడు కూడా. అయితే.. ‘ఇస్మార్ట్ శంకర్‘ తర్వాత అటు పూరి, ఇటు రామ్.. మణిశర్మ లను ఫ్లాపులు వెంటాడాయి. మళ్లీ వీరు ముగ్గురు ఫుల్ ఫామ్ లోకి వచ్చేందుకు ‘డబుల్ ఇస్మార్ట్‘తో రెడీ అవుతున్నారు.

లేటెస్ట్ గా ‘డబుల్ ఇస్మార్ట్‘ టీమ్ లోకి మణిశర్మ జాయిన్ సందర్భంగా ఓ స్పెషల్ ఫోటోని రిలీజ్ చేశారు మేకర్స్. డైరెక్టర్ పూరి, హీరో రామ్, నిర్మాత ఛార్మీలతో పాటు.. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కలిసున్న ఈ ఫోటో ఆకట్టుకుంటుంది. ముహూర్తాన్ని జరుపుకున్నప్పుడే విడుదల తేదీని ప్రకటించడం పూరి స్టైల్. ఈకోవలోనే ‘డబుల్ ఇస్మార్ట్‘ సినిమాని 2024, మార్చి 8న తీసుకొస్తానని ప్రకటించాడు. అందుకోసమే.. ఈ సినిమా షూటింగ్ ను జెట్ స్పీడులో కంప్లీట్ చేస్తున్నాడట. మొత్తంమీద.. ‘ఇస్మార్ట్ శంకర్‘తో ఓ సెన్సేషన్ సృష్టించిన ఈ కాంబో.. ‘డబుల్ ఇస్మార్ట్‘తో అందుకు డబుల్ సెన్సేషనల్ హిట్ అందుకుంటారేమో చూడాలి.

Related Posts