ఇప్పటికే చియాన్ విక్రమ్ నటించిన ‘ధృవనక్షత్రం’ మూవీ వాయిదా పడగా ఈరోజు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా మరోసారి పోస్ట్పోన్ అయింది. ఈ విషయాన్ని డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. “సారీ, ధృవ నక్షత్రం సినిమాను ఈరోజు థియేటర్ల లోకి తీసుకురాలేకపోయాం. ఎంతో ప్రయత్నించాము.
https://twitter.com/menongautham/status/1727801454516396322/photo/1
కానీ, ఇంకా మాకు రెండు రోజుల టైమ్ కావాలి. తప్పకుండా ప్రేక్షకులకి మంచి అనుభూతినైతే అందిస్తాని ఆశిస్తున్నాం”.. అంటూ పోస్ట్ లో తెలిపారు. కాగా, ఈ సినిమాలో తెలుగమ్మాయి రీతూ వర్మ, పార్థిబాన్, రాధికా శరత్ కుమార్, సిమ్రాన్, వినాయకన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి గౌతమ్ మీనన్ దర్శక నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.