మహేష్, రాజమౌళి అతిథులుగా ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

‘యానిమల్’ సినిమాకి హిందీలో ఎంత క్రేజుందో.. అంతకు మించిన క్రేజ్ తెలుగులో ఉంది. అందుకు ప్రధాన కారణం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ‘అర్జున్ రెడ్డి’తో తెలుగులో సంచలనాలు సృష్టించిన సందీప్.. మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత ‘యానిమల్’ చిత్రంతో ఇక్కడి ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఇటీవలే రిలీజైన ట్రైలర్ తో ‘యానిమల్’పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ ఏడాది విడుదలైన ట్రైలర్స్ లో ‘యానిమల్’ బెస్ట్ ట్రైలర్ గా ప్రశంసలు అందుకుంటోంది.

డిసెంబర్ 1న విడుదలకు ముస్తాబవుతోన్న ‘యానిమల్’ టిక్కెట్ బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. టిక్కెట్స్ కి విపరీతమైన స్పందన వస్తోంది. ఈరోజు హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్శిటీలో భారీ ఎత్తున ‘యానిమల్’ ప్రీ రిలీజ్ జరగబోతుంది. ఇప్పటికే చిత్రబృందం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి హాజరవుతున్నారు. దీంతో తెలుగు ప్రేక్షకులంతా ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts