పుంజుకుంటోన్న ‘పొలిమేర 2’ వసూళ్లు

కంటెంట్ బాగుంటే చాలు సినిమా చిన్నదా పెద్దదా అని ఆలోచించరు ఆడియన్స్. తమ మనసుకి నచ్చిన చిత్రాలకి వసూళ్ల వర్షం కురిపిస్తుంటారు. గత శుక్రవారం విడుదలైన చిత్రాల్లో ‘పొలిమేర 2’ ఒకటి. కరోనా సమయంలో ఓటీటీలో విడుదలైన ‘మా ఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్ ఇది. సత్యం రాజేష్ హీరోగా అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ‘పొలిమేర 2’ బాగా పికప్ అవుతోంది.

తొలిరోజే రూ.3 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. రెండో రోజు నుంచి ఇంకా బాగా పికప్ అయిన ఈ చిత్రం ఆదివారంతో బ్రేక్ ఈవెన్ సాధించొచ్చని అంచనా వేస్తున్నారు. ఒక గ్రామంలో చేతబడులు, క్షుద్రపూజలు చుట్టూ సాగే కథతో రూపొందిన ఈ సినిమాలోని సత్యం రాజేష్ నటన, కథలోని ట్విస్టులు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి.

Related Posts