విశాల్ సరికొత్త మాస్ అవతారం ‘రత్నం’

మాస్ హీరో విశాల్ 34వ సినిమాకి ‘రత్నం‘ అనే టైటిల్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాకి హరి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘భరణి, పూజ‘ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు వీరి కలయికలో రాబోతున్న మూడో సినిమా ఇది. ఈ మూవీలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. తాజాగా ‘రత్నం‘ సినిమా ఫస్ట్ షాట్ పేరుతో స్మాల్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

https://www.youtube.com/watch?v=r4pJXgZtdTs

విశాల్ మాస్ అవతార్ లో నడుస్తూ వెళ్లి.. కత్తితో ఒకరి తల నరికే సన్నివేశంతో సాగింది ఈ టైటిల్ టీజర్. ‘కన్నీరే నెత్తురు చిందగా.. క్రోదమే రుధిరం చిమ్మగా.. ఆగ్రహమే అరుణధారగా.. రణరంగమే రక్తపు ఏరుగా’ అంటూ డి.ఎస్.పి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎం సుకుమార్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తుండగా.. కనల్ కన్నన్, పీటర్ హెయిన్, దిలిప్ సుబ్రయాన్, విక్కీ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు.

Related Posts