విదేశాలకు విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషీ చిత్రం చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణలో ఉంది. దీం తర్వాత పరశురామ్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మించే సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఈ మూవీ ఈ నెల 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది.

విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించబోతోంది. అయితే ఈ సినిమా 70శాతం వరకూ యూఎస్ఏ లోనే షూటింగ్ జరుపుకుంటుందట. అందుకోసం మూవీ టీమ్ కొన్ని రోజుల క్రితమే యూఎస్ఏలో షూటింగ్ లొకేషన్స్ కోస వెళ్లింది. దిల్

రాజు తో పాటు దర్శకుడు, కెమెరామెన్ కూడా ఉన్నారు. వీరంతా తమ కథకు తగ్గ లొకేషన్స్ ను ఫైనల్ చేసుకున్నారు. ఇక త్వరలోనే యూఎస్ఏకు ఎంటైర్ టీమ్ వెళ్లబోతోంది.ఈ నెల 12న ఇక్కడ ప్రారంభం అయ్యే ఈ సినిమాకు సంబంధించి కొన్ని సీన్స్ ను ఇక్కడే ఓ మూడు నాలుగు రోజుల పాటు చిత్రీకరిస్తారట. ఆ తర్వాతే యూఎస్ఏకు వెళ్లబోతున్నారు.


ఇక విజయ్ విదేశాలకు వెళ్లేలోగా ఖుషీ షూటింగ్ మొత్తం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ద్రాక్షారామంలో క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ పూర్తయిందని చెబుతున్నారు. మరో రెండు మూడు రోజుల్లో విజయ్ కి సంబంధించిన షూటింగ్ అంతా పూర్తవుతుందట. సో.. ఇక పరశురామ్ మూవీ కోసం యూఎస్ వెళతాడు.


మరోవైజు విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో రూపొందే సినిమాను కూడా చేస్తున్నాడు. ఈ మూవీ కోసం ఆల్రెడీ ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది. మరి గౌతమ్ కూడా యూఎస్ లో ఇంకేదైనా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటాడా.. లేక అక్కడి నుంచి వచ్చాకే ఇక్కడ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా విజయ్ దేవరకొండకు వరుస ఫ్లాపులు వస్తున్నా.. దూకుడు మాత్రం తగ్గడం లేదు అనే చెప్పాలి.

Related Posts