పవన్ కళ్యాణ్‌ ‘ఓ.జి’పై భారీ రూమర్

రూమర్స్ అంటే చాలామంది లైట్ తీసుకుంటారు. కానీ కొన్ని రూమర్స్ సినిమాను ఖచ్చితంగా ఇబ్బంది పెడతాయి. మరికొన్నిసార్లు డ్యామేజ్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ సినిమాకు సంబంధించి వినిపిస్తోన్న రూమర్ కూడా అలాంటిదే అని చెప్పాలి.

సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్‌ చాలా గ్యాప్ తర్వాత మాఫియా డాన్ గా కనిపించబోతోన్న సినిమా ఓజి. ఇప్పటికే ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. ఈ యేడాది డిసెంబర్ 21న సినిమాను విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. ఆ మేరకు చిత్రీకరణ చాలా వేగంగా సాగుతోంది. రీసెంట్ గా 50 శాతం షూటింగ్ అయిపోయింది అని అఫీషియల్ గానే ప్రకటించారు. ఇక్కడే రూమర్ రాయుళ్లకు ఓ బలమైన ఆధారం లాంటిది దొరికింది.

నిజానికి పవన్ కళ్యాణ్‌ ఈ సినిమా కోసం ఇప్పటి వరకూ ఓ పది పదిహేను రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చి ఉన్నాడు. స్టార్టింగ్ లో ముంబై షెడ్యూల్ కోసం ఓ వారం రోజులు.. ఆ తర్వాత హైదరాబాద్ లోని సెట్ కోసం ఓ వారం రోజులు కేటాయించాడు. ఆ తర్వాత వారాహి విజయ యాత్రను మొదలుపెట్టాడు. ఈ యాత్ర మొదలైన తర్వాత పవన్ కళ్యాణ్‌ మళ్లీ షూటింగ్ లో పార్టిసిపేట్ చేయలేదు.

అలాంటిది అతను లేకుండానే ఏకంగా 50 శాతం షూటింగ్ ఎలా పూర్తవుతుందీ అనేది వీళ్లు తీస్తున్న లాజిక్. అంటే పవన్ కళ్యాణ్‌ లేని సీన్స్ షూటింగ్ చేసి ఉండొచ్చు కదా.. అని ఎవరైనా కౌంటర్ వేస్తారు. బట్.. అది కాదు వీళ్లు చెప్పేది.


ఈ సినిమా కోసం కూడా పవన్ కళ్యాణ్‌ డూప్ ను వాడుతున్నారు. ఆ డూప్ తోనే చాలా సీన్స్ షూటింగ్ చేశారు అనేది అసలు రూమర్. భీమ్లా నాయక్ లోనూ కొన్ని షాట్స్ ను డూప్ తో తీశారు. అది సాధారణ ప్రేక్షకులకు కూడా కొంత వరకు అర్థమైంది.

బట్ ఈ సారి ఆ తప్పు దొర్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని డూప్ తోనే కొన్ని మేజర్ సీన్స్ షూటింగ్ చేశారు అంటున్నారు. లేదంటే హీరో లేకుండా 50శాతం షూటింగ్ ఎలా పూర్తవుతుంది.. ? అనేది రూమర్ గాళ్ల ప్రశ్న. ఇక ఇలాంటి రూమర్స్ ఎవరు క్రియేట్ చేస్తారో సులువుగానే ఊహించొచ్చు. బట్.. వీటిని లైట్ తీసుకుంటే సినిమాకు వెయిట్ తగ్గుతుంది. అందుకే దీనిపై ఓ క్లారిటీ ఇస్తే బెటర్..

Related Posts