హోల్డ్ లో రవితేజ-మలినేని ప్రాజెక్ట్?

హిట్టైన కాంబినేషన్స్ లో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు ఎంతగానో ఉత్సాహాన్ని చూపిస్తారు. అలాంటి క్రేజీ కాంబో అయిన రవితేజ-మలినేని గోపీచంద్ కలయికలో సినిమాకి శ్రీకారం చుట్టింది అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ‘డాన్ శీను, బలుపు, క్రాక్’ వంటి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న రవితేజ-మలినేని గోపీచంద్ కాంబోలో నాల్గవ సినిమాకి ‘ఆర్.టి 4 జి.ఎమ్’ అనే వర్కింగ్ టైటిల్ కూడా ప్రచారంలో ఉంది.

రవితేజ-మలినేని మూవీలో తమిళ దర్శకుడు, నటుడు సెల్వరాఘవన్ కీలక పాత్ర పోషించబోతున్నట్టు ప్రకటించారు. తమన్ ని సంగీత దర్శకుడిగా అనౌన్స్ చేశారు. ఈనెలలోనే ఈ చిత్రం పట్టాలెక్కాల్సి ఉంది. అయితే.. బడ్జెట్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమాని హోల్డ్ లో పెట్టిందట నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. రవితేజా మార్కెట్ కి మించి బడ్జెట్ అవుతుండడంతో.. మళ్లీ స్క్రిప్ట్ పరంగా మార్పులు చేయాల్సిందిగా డైరెక్టర్ ను కోరిందట. రవితేజ-మలినేని ప్రాజెక్ట్స్ హోల్డ్ లోకి వెళ్లిందనే దానిపై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Related Posts