వాళ్ళను చూడగానే వెంకీ ఎనర్జీ లెవల్స్ డబుల్..

విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన లేట్సెట్ మూవీ సైంధ‌వ్. శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న రిలీజ్ చేయబోతున్నారు. డిసెంబర్ లో సైంధ‌వ్ థియేట్రికల్ ట్రైల‌ర్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజ‌ర్ అందరినీ ఆకట్టుకొని సినిమాపై బాగా అంచ‌నాలు పెంచింది.

ఇక తాజాగా ఈ మూవీ నుంచి రాంగ్ యూసేజ్ అనే పాట రిలీజై యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ పాట విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించారు. అక్క‌డ స్టూడెంట్స్ ని చూసి వెంకీలో ఎన‌ర్జీ రెట్టింపు అయింది. దాంతో స్టేజ్ మీద ఎంతో హుషారుగా మాట్లాడారు. అంతేకాదు పాట విడుదల స‌మ‌యంలో వెంకీ నటించిన సినిమాల్లోని పాట‌ల‌కు స్టూడెంట్స్ స్టెప్పులేశారు. సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన వెంకీ వారితో కలిసి హుషారుగా స్టెప్పులేశారు.

Related Posts