విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’.ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి వహించారు. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర హీరోయిన్ ఆయూషి పటేల్ చిత్ర విశేషాలు పంచుకున్నారు.
”నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలా ఉండదు.
చిన్నతనం నుంచీ నాకు సినిమాలంటే ఇష్టం. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. ఆయనలానే ఎదగాలని అనుకునేదాన్ని. ఈ మూవీ నాకు ఓ మేనేజర్ వల్ల వచ్చింది. ఈ మూవీ కోసం ఎన్నో వర్క్ షాప్స్ చేశాం. ఆ టైంలోనే హీరో విశ్వతో కలిసి ఎన్నో సీన్ల గురించి చర్చించుకున్నాం. డపలో అందమైన లొకేషన్స్ చాలా ఉన్నాయి. అక్కడి ప్రజలు ఎంతో సపోర్ట్ చేశారు. ప్రస్తుతం మేం ఈ మూవీ ప్రమోషన్స్ కోసం టూర్స్ వేస్తున్నాం.
వెళ్లిన ప్రతీ చోటా మంచి రెస్పాన్స్ వస్తోంది. దర్శకుడు రమాకాంత్ రెడ్డి. ఆయనకు ఎంతో క్లారిటీ ఉంది. మా దర్శకుడు ఎప్పుడూ కూడా కట్ చెప్పరు. కట్ చెబితే ఎండ్లో వచ్చే ఎక్స్ప్రెషన్స్ మిస్ అవుతాయ్ అని కట్ చెప్పరు. మా దర్శకుడు ఎంతో సరదాగా షూటింగ్ చేసేవారు. కథ ఏం చెప్పారో.. అదే తీశారు. ఆర్ఆర్ వల్ల సినిమా మరోస్థాయికి వెళ్లింది.ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు. మంచి సినిమా తీశాం.. దాన్ని ఎలాగైనా జనాల్లోకి తీసుకెళ్లాలని మా నిర్మాతలు తపనపడుతుంటారు.విశ్వ కార్తికేయ నాకు ఎంతో సహకరించారు. ప్రతీ సీన్ గురించి చర్చించుకునేవాళ్లం. ఇలా చేద్దాం.. అలా చేద్దాం అని మాట్లాడుకునేవాళ్లం. ఇంత మంచి వ్యక్తితో నా మొదటి సినిమా రావడం ఆనందంగా ఉంది.
కలియుగం పట్టణంలో రిలీజ్ కాకముందే నాకు మూడు ప్రాజెక్టుల్లో అవకాశాలు వచ్చాయి. లిప్ లాక్, ఎక్స్పోజింగ్ వంటివి నాకు నచ్చదు. అందుకే చాలా సినిమాలు ఒప్పుకోలేదు. నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నాను. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి రాలేదు. కొన్ని సినిమాలు చేసినా పర్లేదు.. మంచి చిత్రాలు చేయాలని అనుకుంటున్నా”నన్నారు ఆయుషి పటేల్.