పవన్ కళ్యాణ్ పోటీచేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మెగా హంగామా కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ ని ఎమ్మేల్యేగా గెలిపించేందుకు మెగా టీమ్ అంతా పిఠాపురంలో సందడి చేస్తున్నారు. ఇప్పటికే జబర్దస్త్ టీమ్ హైపర్ ఆది, గెటప్ శ్రీను, రాం ప్రసాద్ వంటి వారు అక్కడ ఓ రేంజులో ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నామినేషన్ సందర్భంగా ఎస్.కె.ఎన్, సాయిరాజేష్ వంటి వారు కూడా పిఠాపురంలో కనిపించారు. ఇంకా.. జానీ మాస్టర్, ‘గబ్బర్ సింగ్’ గ్యాంగ్ కూడా పవన్ తరపున ప్రచారం చేస్తూ పిఠాపురంలో సందడి చేస్తున్నారు.
లేటెస్ట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పిఠాపురం బయలుదేరాడు. ఈరోజు (ఏప్రిల్ 27) పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నాడు వరుణ్ తేజ్. మరి.. వరుణ్ బాటలో ఇంకెంతమంది మెగా హీరోలు పిఠాపురంలో సందడి చేస్తారో చూడాలి.
ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ వరించింది. దేశంలోనే రెండో…
ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండేసి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ…
సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ వాయిస్ ఓవర్ తోనూ ఆడియన్స్…
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్యాక్ టు…
బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమైన హిందీ చిత్ర పరిశ్రమ.. గత ఏడాది…
దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం…