ఈతరం మహానటి కీర్తి సురేష్

షార్ట్ పీరియడ్ లోనే సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో కీర్తి సురేష్ ఒకరు. మాతృ భాష మలయాళంలో కథానాయికగా పరిచయమైన కీర్తి.. ‘నేను శైలజ’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నానితో ‘నేను లోకల్, పవన్ కళ్యాణ్ తో ‘అఙ్ఞాతవాసి’ వంటి చిత్రాలు చేసింది. ఇక.. సావిత్రి బయోపిక్ ‘మహానటి’ చిత్రం.. కీర్తి కెరీర్ కు మంచి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ చిత్రంతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సైతం అందుకుంది. అక్టోబర్ 17న, కీర్తి సురేష్ పుట్టినరోజు.

‘మహానటి’ తర్వాత పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ వైపు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కీర్తి. అలా లేడీ ఓరియెంటెడ్ గా ‘పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, సాని కాయిదం’ వంటి చిత్రాలు చేసింది. వీటిలో మూడు చిత్రాలు డైరెక్ట్ ఓటీటీలో రిలీజవ్వగా.. ‘గుడ్ లక్ సఖి‘ మాత్రం థియేట్రికల్ రిలీజయ్యింది. అయితే.. ఈ చిత్రాలలో కీర్తి నటనకు ప్రశంసలు దక్కినా.. ‘సాని కాయిదం‘ ఒక్కటే కీర్తి సురేష్ కి విజయాన్నందించింది.

ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూనే.. మరొకవైపు అగ్ర కథానాయకులతో కమర్షియల్ మూవీస్ లోనూ అలరించింది కీర్తి. ఈ కోవలోనే నితిన్ తో చేసిన ‘రంగ్ దే‘ ఫర్వాలేదనిపించగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన కీర్తి నటించిన ‘సర్కారు వారి పాట‘ వసూళ్ల వర్షం కురిపించింది. ఇక నాని కి జోడీగా నటించిన ‘దసరా‘ చిత్రంలో వెన్నెల పాత్రలో కీర్తి పెర్ఫామెన్స్ కి మంచి పేరొచ్చింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ‘భోళా శంకర్‘ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యింది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేకపోయినా.. తమిళంలో మాత్రం రెండు, మూడు చిన్న సినిమాలలో నటిస్తుంది కీర్తి.

Related Posts