నేను పవన్, ప్రభాస్ లా కాదు

నేను పవన్, ప్రభాస్ లా కాదు అంటున్నాడు ఇండియన్ మాజీ క్రికెటర్ ఎమ్ఎస్ ధోనీ. క్రికెట్ తర్వాత ఏంటీ అనే ప్రశ్నకు చాలామంది రకరకాల బిజినెస్ లు చూసుకుంటారు. అయితే ధోనీ మాత్రం సినిమా పరిశ్రమను ఎంచుకున్నాడు. ఆయన నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్నాడు.

ఈ మేరకు ఆయన భార్య సాక్షి సింగ్ ఈ నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటోంది. ధోని బ్యాక్ ఎండ్ లో ఉంటాడు. వీరి బ్యానర్ నుంచి వస్తోన్న ఫస్ట్ మూవీ ఎల్.జి.ఎమ్. అంటే లెట్స్ గెట్ మ్యారీడ్ అంని. అంటే మనం పెళ్లి చేసుకుందాం అని తెలుగు అర్థం.నాని జెర్సీ సినిమాలో అతని పెద్దవాడైన కొడుకుగా నటించిన హరీష్‌ కళ్యాణ్‌, లవ్ టుడే బ్యూటీ ఇవానా జంటగా నటించిన ఈ చిత్రంలో నదియా కీలక పాత్ర చేసింది.

రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అయితే తెలుగులో ఎల్.జి.ఎమ్ ప్రమోషన్స్ కు వచ్చిన ధోనీ ప్రభాస్, పవన్ కళ్యాణ్ పై చేసి వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.


మీరూ నటిస్తారా అన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ.. “ఇక్కడ పవన్ కళ్యాణ్‌, ప్రభాస్ లు సినిమాల్లో నటిస్తూ భారీగా సంపాదిస్తున్నారు. వారి శాలరీస్(రెమ్యూనరేషన్స్) కూడా భారీగా ఉన్నాయి. కానీ నేను ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాను. కొంత కాలం పాటు నన్ను నేర్చుకోనివ్వండి అప్పుడు చూద్దాం.. ” అన్నాడు ధోనీ.

అంటే మన హీరోల రెమ్యూనరేషన్స్ ను కూడా మనోడు బాగానే అబ్జర్వ్ చేస్తున్నాడన్నమాట. మరి దీనర్థం వీరితో కూడా సినిమాలు చేయాలన్న ఆలోచన ఉందనే కదా..? అది ఎప్పుడు సాధ్యం అవుతుందో కానీ.. ఈ సినిమా ప్రమోషన్స్ లో మాత్రం భార్యభర్త ఇద్దరూ భలే హుషారుగా ఉన్నారు. మరి ఈ మూవీ వీరికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో కానీ.. ఐపిఎల్ లో చెన్నైకి ఆడటం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ ఇన్ డైరెక్ట్ చెన్నైని సెకండ్ హోమ్ భావిస్తున్నాడు ధోనీ. అందుకే తన కొత్త వ్యాపారాన్ని చెన్నై నుంచే ప్రారంభించాడు.

Related Posts