బాలకృష్ణను లైన్లో పెడుతున్న పూరి

పూరి జగన్నాథ్ తో ఒక సినిమా చేసిన స్టార్ హీరో ఎవరైనా వెంటనే మరోసారి సినిమా చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తారు. ఆ విధంగానే నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు.. పూరితో రెండేసి సినిమాలు చేశారు. ఈకోవలోనే నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా ‘పైసా వసూల్’ సమయంలోనే పూరితో రెండో సినిమా చేస్తానని మాట ఇచ్చాడట.

‘లైగర్’ ఫ్లాప్ తో డీలాపడ్డ పూరి ఇప్పుడు రామ్ తో ‘డబుల్ ఇస్మార్ట్’ని తెరకెక్కిస్తున్నాడు. రామ్ కూడా పూరితో ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. వచ్చే యేడాది మార్చిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆ తర్వాత బాలకృష్ణతో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట పూరి. ప్రస్తుతం బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీని సిద్ధం చేస్తున్నాడట.

మరోవైపు ‘భగవంత్ కేసరి’ తర్వాత బాలయ్య.. బాబీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత బోయపాటితో ‘అఖండ 2’ ఉండే అవకాశాలున్నాయి. ఈలోపులో పూరి చెప్పన స్టోరీ నచ్చితే బాలయ్య కిట్టీలో డాషింగ్ డైరెక్టర్ సినిమా కూడా ఉండొచ్చు. కథ నచ్చితే చాలు డైరెక్టర్స్ ట్రాక్ రికార్డును అస్సలు పట్టించుకోడు నటసింహం. మరి.. త్వరలోనే బాలకృష్ణ-పూరి కాంబోలో సినిమా సెట్టయినా ఆశ్చర్యం లేదు.

Related Posts