రణ్భీర్ కపూర్, ఆలియా భట్ జంటకు అనుకోని షాక్ తగిలింది. అది కూడా అభిమానుల నుంచి. అసలేం జరిగిందనే వివరాల్లోకి వెళితే, వీరిద్దరూ కలిసి జంటగా నటించిన తాజా చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. సెప్టెంబర్ 9న మూవీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. అందులో భాగంగా రణ్భీర్, ఆలియా కలిసి మధ్యప్రదేశ్లోని ఉజ్ఞయిని మహాకాళి దర్శనానికి వెళ్లారు. అయితే గతంలో రణ్భీర్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై అక్కడ నిరసనకారుల నుంచి వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఇరువురిని ఆలయంలోకి ప్రవేశింప చేయరాదని నిరసనలు చేపట్టారు. నిరసన సెగలు ఎక్కువగా ఉండటంతో పరిస్థితిని అంచనా వేసి పోలీసులు వారిని అక్కడ నుంచి సంధ్య పూజ చేయకుండానే పంపేశారు.
కానీ బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీని ఆలయంలోనికి అనుమతించారు. ‘కాళిమాత దర్శనం కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నా. దర్శనం అద్భుతంగా జరిగింది. మా సినిమాపై ఆ కాళి మాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ మహాకాళి దర్శనం తర్వాత ఆ ఫొటోలను అయాన్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. గతంలో రణ్భీర్ ఓ సందర్భంలో మాట్లాడుతూ తనకు బీఫ్ అంటే ఇష్టమని, తరుచూ తింటుంటానని అన్నారు. ఇప్పుడా వీడియో వైరల్గా మారింది. దీనికి సంబంధించే రణ్భీర్, ఆలియాలకు నిరసన గళం వినిపించింది
ఇక బ్రహ్మాస్త్ర సినిమా విషయానికి వస్తే సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. ఇందులో రణ్భీర్, ఆలియా హీరో హీరోయిన్లుగా నటిస్తే అమితాబ్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలను పోషించారు.
సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో సమంత ముందు వరుసలో ఉంటుంది. ట్విట్టర్ లో పది మిలియన్లకు…
ఒకప్పుడు జపాన్ లో బాగా తెలిసిన ఇండియన్ యాక్టర్ అంటే రజనీకాంత్ అని చెప్పాలి. రజనీకాంత్ నటించిన 'ముత్తు' చిత్రం…
సమ్మర్.. సినిమాలకు అతిపెద్ద సీజన్. అయితే.. ఈ ఏడాది వేసవి చాలా డల్ గా సాగుతోంది. ఒకవైపు పెద్ద సినిమాలు…
ఈ వారం థియేటర్లలోకి వచ్చిన చిత్రాల్లో అల్లరి నరేష్ ‘ఆ… ఒక్కటీ అడక్కు‘ ఒకటి. రాజేంద్రప్రసాద్ సూపర్ హిట్ మూవీ…
‘జబర్దస్త్‘ ప్రోగ్రామ్ లో వెరైటీ గెటప్స్ తో ఆడియన్స్ ను అలరించే గెటప్ శ్రీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు…