సీనియర్ స్టార్స్ .. బాక్సాఫీస్ వార్ ..

సీనియర్ తెలుగువారికి పండగలంటే ఎంత ఇష్టమో.. ఆ టైమ్ అంటే టాలీవుడ్ కు అంత ఇష్టం. మనవాళ్లు ఫ్యామిలీ అంతా కలిసి సినిమా కూడా చూడటాన్ని పండగలో భాగంగానే చూస్తారు కాబట్టి.. ఆయా సీజన్స్ లో టాప్ స్టార్స్ మూవీస్ అన్నీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి. ఆ సందడి వల్ల పోటీ కూడా పెరుగుతుంది. మరి ఈ కాంపిటీషన్ లో ఖలేజా చూపించేవారికే బాక్సాఫీస్ ఫిదా అవుతుంది. సమ్మర్ తర్వాత తెలుగు సినిమాకు వచ్చే అతి పెద్ద సీజన్ దసరా.. అందుకే ఇప్పటి నుంచే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తూ పండగ జోష్‌ ను డబుల్ చేస్తున్నారు. అయితే ఈ దసరా సీనియర్ స్టార్స్ మధ్య సివియర్ వార్ కు వేదిక కాబోతోంది.పండగ అంటే అదే రోజు వచ్చే సినిమాలు ఉంటాయి. దానికంటే ముందే వచ్చే హాలిడేస్ ను టార్గెట్ చేసుకుని రిలీజ్ అయ్యే మూవీస్ ఉంటాయి. అలా ఖచ్చితంగా అక్టోబర్ 5న పండగ రోజే వస్తాం అని అక్కినేని నాగ్ నటించిన ఘోస్ట్ మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్ లో వస్తోన్ని సినిమా ఇది. రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్ ఆకట్టుకుంది. నాగ్ కు సాలిడ్ హిట్ పడక చాలా రోజులైంది. ఆ లోటును ఈ ఘోస్ట్ తీరుస్తుందని అభిమానులంతా అనుకుంటున్నారు.పండగ శెలవులను టార్గెట్ చేసుకుని వారం ముందు నుంచే సందడి చేసేందుకు చాలా సినిమాలు లైన్ లో ఉన్నాయి. అందులో మెగాస్టార్ గాడ్ ఫాదర్ ఒకటి. మళయాల బ్లాక్ బస్టర్ లూసీఫర్ కు రీమేక్ గా వస్తోన్న ఈ చిత్రాన్ని మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. నయనతార, సల్మాన్ ఖాన్, సునిల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ వీడియో గ్లింప్ కూడా ఆకట్టుకునేలా ఉంది. మెగాస్టార్ లుక్ కూడా ఆకట్టుకుంటోంది. ఈ మూవీనీ దసరాకే రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. అయితే సెప్టెంబర్ 30న విడుదలయ్యే అవకాశాలున్నాయి.ఈ ఇద్దరితో పాటు మరో సీనియర్ స్టార్ బాలయ్య కూడా దసరా బరిలోనే ఉన్నాడు అనే వార్తలు వస్తున్నాయి. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నటిస్తోన్న ఈ మూవీని దసరాకే విడుదల చేస్తారు అనే ప్రచారం జరుగుతోంది. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో కన్నడ హీరో దునియా విజయ్ విలన్ గా కనిపించనున్నాడు.

ఒకవేళ వీళ్లూ కన్ఫార్మ్ చేస్తే దసరా వార్ మామూలుగా ఉండదనే చెప్పాలి. వీరితో పాటు ఇంకా చాలా సినిమాలు సెప్టెంబర్ చివరి రోజును టార్గెట్ గా చేసుకుని రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాయి. అందులో మాస్ మహరాజ్ రవితేజ రావణాసుర కూడా ఉంది. సెప్టెంబర్ 30న రావణాసురను విడుదల చేయబోతున్నారు. ఈ మూవీలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. డిఫరెంట్ మేకింగ్ తో ఆకట్టుకునే సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మాస్ రాజా సరసన మేఘా ఆకాశ్, అను ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హిట్టూ ఫ్లాపులతో పనిలేకుండా దూసుకుపోతోన్న స్టార్స్ లో రవితేజ ముందుంటాడు. ఈ నెల 29న రామారావు ఆన్ డ్యూటీ విడుదల కాబోతోంది. రెండు నెలల తర్వాత రావణాసుర వస్తుంది. గతంలో వచ్చిన ఖిలాడీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా డిక్లేర్ అయింది. తర్వాత కూడా ఇంకా ధమాకా, టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలు లైన్ లో ఉన్నాయి. మొత్తంగా దసరా బరిలో మాస్ రాజా కూడా సత్తా చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు.ఇక దసరాకే వచ్చే మరో సినిమా నాని హీరోగా నటించిన దసరా. పండగనే సినిమా టైటిల్ గా పెట్టుకుని నాని చేస్తోన్నీ ఈ ఊరమాస్ ఎంటర్టైనర్ పై ఇప్పటికే మంచి క్రేజ్ వచ్చింది. టైటిల్ కు తగ్గట్టుగానే దసరాకే చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ మూవీలో నాని సరసన కీర్తి సురేష్‌ హీరోయిన్ గా నటిస్తోంది. సింగరేణి గనుల నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఓ కొత్త దర్శకుడు రూపొందిస్తున్నాడు. తెలుగు సినిమాలతో పాటు మణిరత్నం ప్రిస్టీజియస్ గా రూపొందిస్తోన్న పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 కూడా దసరా బరిలోనే ఉంది. ఇప్పటికే సెప్టెంబర్ 30న తమ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది టీమ్. మొత్తంగా ఈ లిస్ట్ లోకి మరికొన్ని చిన్న సినిమాలు కూడా యాడ్ అయ్యే అవకాశాలున్నాయి. పోస్ట్ పోన్ అయితే మాత్రం బాలయ్య నటిస్తోన్న మూవీ కావొచ్చు అంటున్నారు. మొత్తంగా ప్యాన్ ఇండియన్ మూవీగా వస్తోన్న పొన్నియన్ సెల్వన్ కూడా అంచనాలున్న మూవీనే. సో.. ఈ సారి దసరా మామూలుగా ఉండదన్నమాట.

Related Posts