జూలై 22న ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ ఫైట్

జూలై 22న మరో ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ ఫైట్ జరగబోతోంది. ఈ ఫైట్ టాలీవుడ్ కు కొత్త హోప్ ఇస్తుందన్న నమ్మకం చాలామందిలో కనిపిస్తోంది. ముఖ్యంగా వరుస హిట్స్ తో జోష్‌ గా ఉన్న నాగచైతన్య నటించిన థ్యాంక్యూ మూవీపై అంచనాలున్నాయి. మనం డైరెక్టర్ విక్రమ్ కుమార్ రూపొందించిన ఈ మూవీలో చైతూ మూడు ఏజ్ గ్రూప్స్ లో కనిపిస్తున్నాడు. అందుకే రాశిఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆ మధ్య విడుదల చేసిన టీజర్ కూడా ఆకట్టుకుంది. నిజానికి ఈ నెల 8నే విడుదల కావాల్సిన సినిమా ఇది. అనుకోని రీజన్స్ తో 22కు పోస్ట్ పోన్ చేశారు. నాగచైతన్య కొన్నాళ్లుగా వరుస విజయాలు సాధిస్తున్నాడు. ఆ సెంటిమెంట్ ఈ మూవీకీ వర్కవుట్ అవుతుందనుకుంటున్నారు. అటు దర్శకుడు విక్రమ్ కుమార్ హ్యాట్రిక్ ఫ్లాపుల్లో ఉన్నా.. వీరి కాన్ఫిడెన్స్ ఆకట్టుకుంటోంది. అందుకే థ్యాంక్యూ ఖచ్చితంగా విజయం సాధించి ఇండస్ట్రీకి గుడ్ న్యూస్ చెబుతుందని చాలామంది భావిస్తున్నారు. ఈ మూవీ టీజర్ చూశాక కథ ఇదీ అనే క్లారిటీ రాకపోయినా.. కంటెంట్ ఆకట్టుకోవచ్చు అనిపించింది. మరి థ్యాంక్యూ కు ఆడియన్స్ కూడా మంచి సినిమా ఇచ్చారని థ్యాంక్స్ చెబుతారా లేదా అనేది చూడాలి.తెలుగులో సీక్వెల్స్ పెద్దగా హిట్ కాలేదు. అయినా గట్టి నమ్మకంతో వస్తోన్న మరో సినిమా కార్తికేయ2. నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో 2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి ఇన్నాళ్ల తర్వాత సీక్వెల్ తో వస్తున్నారు.

కార్తికేయ సినిమా యానిమల్ హిప్నాటిజం అనే కొత్త కాన్సెప్ట్ ను పరిచయం చేసి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది. ఆ టైమ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీకి సీక్వెల్ అంటే ఈసారి అంచనాలు భారీగా ఉంటాయి. వాటిని అందుకోవడంలో అస్సలు వెనక్కి తగ్గ అన్న కాన్ఫిడెన్స్ ఈ మూవీ టీమ్ లో కనిపిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. ఫస్ట్ పార్ట్ లో నిఖిల్ సరసన స్వాతి నటించింది. తను ఇప్పుడు పెళ్లి చేసుకుంది. కారణం అదా లేక మరోటా అనే చెప్పలేం కానీ.. ఈ సారి అనుపమా పరమేశ్వరన్ ను తీసుకున్నారు. టీజర్ చూశాక సీక్వెల్ లో చాలా పెద్ద సెటప్ తోనే వస్తున్నారని అర్థమౌతోంది. నాగచైతన్య వర్�