సర్కారు వారి పాట తర్వాత చైతన్యతోనేనా..?

తెలుగులో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్ లో పరశురామ్ ఒకరు. తీసింది ఆరు సినిమాలే అయినా యూత్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ లో గుర్తింపునిచ్చే సినిమాలను తీసి సక్సెస్ అయ్యాడు. లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట మూవీ చేశాడు పరశురామ్. మరో రెండు వారాల్లో ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సినిమా పనులు ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడంతో పరశురామ్ తన నెక్ట్స్ మూవీపై ఫోకస్ చేస్తున్నాడు. ఇంతకీ పరశురామ్ కొత్త సినిమాలో హీరో ఎవరో తెలుసా…?
టాలీవుడ్ లో మంచి గుర్తింపుతో పాటు సక్సెస్ రేట్ కూడా ఉన్న దర్శకుడు పరశురామ్. పూరీ జగన్నాథ్ శిష్యుడైన పరుశురామ్, పూరీ శైలికి భిన్నంగా సినిమాలు తీసి సక్సెస్ అయ్యాడు. తన ఫస్ట్ మూవీ యువత యూత్ ని ఎట్రాక్ట్ చేస్తే, సోలో ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించింది. ఇక గీతా గోవిందం అయితే యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించి, తనను వంద కోట్ల క్లబ్ లో చేర్చింది.

పరశురామ్ ఇప్పుడు మహేష్ బాబుతో సర్కారు వారి పాట పేరుతో ఓ సినిమా చేశాడు. మైత్రీ, 14 రీల్స్ సంస్థల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి… వచ్చే నెల 12న రిలీజ్ కి రెడీ అవుతోంది. పాటలు, టీజర్లతో సర్కారు వారి పాట మూవీపై ఆడియన్స్ లో మంచి హైప్ వచ్చింది. మహేష్ కెరీర్లో మరో పోకిరిలా ఈ చిత్రం నిలుస్తుందనేంత కాన్ఫిడెన్స్ మేకర్స్ లో కనిపిస్తోంది. సర్కారు వారి పాట కంప్లీట్ అవ్వడంతో…పరశురామ్ తన కొత్త సినిమాని నాగచైతన్యతో చేయడానికి రెడీ అవుతున్నాడనే వార్త వినిపిస్తోంది. నిజానికి సర్కారు వారి పాట కంటే ముందే చైతూతో సినిమాని 14 రీల్స్ సంస్థతో కలసి అనౌన్స్ చేశాడు పరశురామ్. సడన్ గా మహేష్ నుంచి పిలుపు రావడంతో చైతూ సినిమాకి గ్యాప్ ఇచ్చి, మహేష్ మూవీని ఫినిష్ చేశాడు. ఇప్పుడు నాగచైతన్యతో సినిమాని స్టార్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇటు నాగచైతన్య కూడా విక్రమ్ కుమార్ డైరెక్షన్లో థాంక్యూ చిత్రాన్ని, హిందీలో లాల్ సింగ్ చద్దా చిత్రాన్ని కంప్లీట్ చేసేశాడు. సో… పరశురామ్, నాగచైతన్య కాంబోలో ఎలాంటి సినిమా రాబోతుందో చూడాలి.

Related Posts