రాధేశ్యామ్ అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన రాధాకృష్ణ‌.

టెన్ష‌న్ ప‌డుతున్న ఫ్యాన్స్..

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. ఇందులో క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే న‌టించింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు యు.వి. క్రియేష‌న్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇది భారీ పీరియాడిక్ ల‌వ్ స్టోరీగా రూపొంద‌డంతో ప్రారంభం నుంచి భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇక ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ అండ్ ట్రైల‌ర్ రిలీజ్ చేసిన త‌ర్వాత ఆకాశ‌మే హ‌ద్దు అనేలా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ప్రేమ‌, విధి మ‌ధ్య జ‌రిగే యుద్దమే రాధేశ్యామ్ అని తెలుస్తోంది. అయితే.. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌పెట్టాడు. ఇంత‌కీ ఏం చెప్పాడంటే… రాధేశ్యామ్ స్టోరీని నేను ముందు ఇండియాలోని ఓ హిల్ స్టేష‌న్ బ్యాక్ డ్రాప్‌లో చేద్దామ‌నుకున్నార‌ట‌. కానీ ప్ర‌భాస్ ఇచ్చిన సూచ‌న‌ల‌తో ఇట‌లీ బ్యాక్ డ్రాప్‌కి మార్చార‌ట‌. అదే ఇప్పుడు ఈ సినిమాకు మెయిన్ విజువ‌ల్ ఎస్సెట్ అయిందని.. కరోనాకి ముందు ఇట‌లీ, ఇత‌ర యూర‌ప్ దేశాల్లో షూట్ చేసిన‌ప్ప‌టికీ.. కోవిడ్ ఆంక్ష‌ల కార‌ణంగా ఇట‌లీని హైద‌రాబాద్‌కి షిఫ్ట్ చేశామనేతంగా భారీ సెట్స్ వేసి షూటింగ్ చేశామ‌ని ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ చెప్పారు.

అయితే.. ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా ఉండ‌ద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ చెప్పారు. మ‌రి.. ప్ర‌భాస్ సినిమాలో ఫైట్ లేక‌పోతే అభిమానులు, సామాన్య ప్రేక్ష‌కులు ఫీల‌వుతారేమో.. అంటే.. అలాంటిది ఏమీ ఉండ‌దు. ఓ మంచి క‌థ‌ను చెప్పాం. ఇది త‌ర్వాత ఏం జ‌రుగుతుందో అని ఇంట్ర‌స్టింగ్ గా చూసేలా ఉంటుంది క‌నుక ఫైట్ లేద‌నే ఫీలింగ్ అస‌లు క‌ల‌గ‌దు అని చెప్పారు. డైరెక్ట‌ర్ ఇలా చెప్పిన‌ప్ప‌టికీ.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ మాత్రం ఫైట్ లేక‌పోతే ఎలా.? సినిమా ఎలా ఉంటుందో అని తెగ టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. మ‌రి.. రాధేశ్యామ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎంత వ‌ర‌కు మెప్పిస్తుందో చూడాలి.

Related Posts