పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, క్రేజీ హీరోయిన్ పూజాహెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ భారీ పీరియాడిక్ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అన్ని అడ్డంకులను దాటుకుని మార్చి 11న రాధేశ్యామ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే… ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్ కు అన్ని భాషల్లో ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పచ్చు.
ఇదిలా ఉంటే… ఈ సినిమా ట్రైలర్ చూసిన వాళ్లందరిలోఒకటే ప్రశ్న. ఈ మూవీకి డైరెక్టర్ సాడ్ ఎండింగ్ ఇవ్వనున్నారా..? లేక హ్యాపీ ఎండింగ్ ఇవ్వనున్నారా..? ఇది ఇప్పుడు ఆసక్తిగా మారింది. హీరోయిన్ జాతకం మొత్తం తెలిసినప్పటికీ.. ముఖ్యంగా తను ఎప్పుడు చనిపోతుందో తెలిసినా చెప్పలేని పరిస్థితిలో ప్రభాస్ ఉంటాడు. అతను ఊహించినట్టుగానే కథానాయిక షిప్ మునిగిపోయి చనిపోయే పరిస్థితికి వెళుతుంది.
ఆతర్వత ఏం జరిగింది..? జాతకం ప్రకారం చనిపోయిందా..? లేక ప్రేమికుడు తన ప్రియురాలిని బ్రతికించుకోవడం కోసం ఏం చేశాడు..? విధికి ఎదురెళ్లి పోరాడాడా..? చివరికి ఆమెను కాపాడాడా..? అనేది ఆసక్తిగా మారింది. క్లైమాక్స్ ఎపిసోడ్ తెర పై అద్భుతం అనేలా ఉంటుందట. ఇలా క్లైమాక్స్ గురించి వార్తలు వస్తుండడంతో మరింతగా క్యూరియాసిటీ పెరుగుతుంది. దర్శకుడు రాధాకృష్ణ మాత్రం క్లైమాక్స్ గురించి క్లూ ఇవ్వడం లేదు. తెర పై చూడాల్సిందే అంటున్నారు. మూవీ రిలీజ్ కాకుండానే.. రాధేశ్యామ్ ఇండియన్ టైటానిక్ అంటూ అప్పుడే అభినందించేస్తున్నారు సినీ జనాలు. ఏది ఏమైనా రాధేశ్యామ్ క్లైమాక్స్ గురించి క్లారిటీ రావాలంటే.. మార్చి 11 వరకు ఆగాల్సిందే.