పృథ్విరాజ్, అనూ మెహత హీరోహీరోయిన్లుగా పిఎస్ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రాబరీ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా ఓ క్రొత్త చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ ద్వారా పి.మణిరాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పి.నాగమణి సమర్పణలో ప్రవీణ శివరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త తరహా కథ, కథనంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఓ ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికే మొదలైన ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పి. మణిరాజ్ మాట్లాడుతూ – 27 రోజుల పాటు వికారాబాద్, హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని అందమైన లోకేషన్లలో చిత్రీకరణ జరిపాం. ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది. హీరో పృథ్విరాజ్, హీరోయిన్ అనూ మోమత చక్కగా నటించారు. టెక్నీషియన్స్ అందరూ పూర్తి సహకారం అందించారు. షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. ఒక రాబరీ బ్యాక్డ్రాప్లో జరిగే క్రైమ్ థ్రిల్లర్ ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి నవంబరు నెలలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. త్వరలోనే టైటిల్, ఫస్ట్ విడుదల చేస్తాం
అన్నారు.
రెబెల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 ఎ.డి' సినిమా కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చేసింది. అందరూ ఊహించినట్టుగానే…
‘గామి‘తో డీసెంట్ హిట్ అందుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇప్పుడు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ చిత్రంతో ప్రేక్షకుల…
సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ ‘హరోం హర‘. ఇప్పటివరకూ సుధీర్ బాబు చేయనటువంటి వైవిధ్యభరిత పాత్రతో ఈ సినిమా రాబోతుంది.…
కమెయడిన్ ధనరాజ్ డైరెక్టర్ గానూ సత్తా చాటడానికి సిద్ధమయ్యాడు. ధనరాజ్ దర్శకత్వం వహిస్తూ నటిస్తోన్న చిత్రం 'రామం రాఘవం'. తండ్రీకొడుకుల…
అక్కినేని నాగచైతన్య సినిమాల సెలక్షన్ ఎప్పుడూ ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. ‘దూత‘ సిరీస్ విజయంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన…