పవన్ కళ్యాణ్ తనయుడికి కరోనా.. రేణూకు సైతం

పవన్ కళ్యాణ్ రెండో భార్య తనయుడు అకీరా నందన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం తన తల్లితో కలిసి పూణేలో ఉంటున్నాడు అకీరా. కొన్నాళ్లుగా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇంటికే పరిమితం అయినా తనతో పాటు అకీరాకూ కరోనా పాజిటివ్ వచ్చిందని రేణూదేశాయ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. కరోనా సెకండ్ వేవ్ లో పవన్ కళ్యాణ్ సైతం కరోనా బారిన పడ్డాడు. ఇప్పుడు కొడుకుతో పాటు మాజీ భార్యకు పాజిటివ్ గా తేలింది.
అయితే తనకూ అకీరాకు సాధారణ లక్షణాలే ఉన్నాయని తెలిపింది రేణూ దేశాయ్. ప్రస్తుతం కోలుకుంటున్నామని.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. అనని జాగ్రత్తలు తీసుకుని బయట తిరగాలని విజ్ఞప్తి చేసింది రేణూ. అయితే రేణు గతంలోనే కరోనా వాక్సినేషన్ రెండు డోస్ లూ తీసుకుందట. అయినా పాజిటివ్ రావడం ఆశ్చర్యంగా ఉందని తెలిపింది. మరోవైపు అకీరా(టీనేజ్ లో ఉన్నాడుకదా) త్వరలోనే వ్యాక్సిన్ వేయించాలనుకుంటున్నానని ఈలోగా కరోనా వచ్చిందని పోస్ట్ చేసింది. ఏదేమైనా ఈ ఇద్దరితో పాటు కరోనా బారిన పడిన పడుతున్నవారంతా త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

Related Posts