రవితేజకు విలన్ గా అక్కినేని హీరో

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా రూపొందుతోన్న సినిమా రావణాసుర. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా ఓ కొత్త అప్డేట్ ఇచ్చారు. రావణాసురలో రవితేజ ఫస్ట్ టైమ్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. కొన్నాళ్ల క్రితమే ఓపెనింగ్ జరుపుకున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇక ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లుంటారని సమాచారం.ఓ హీరోయిన్ గా జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లాను సెలెక్ట్ చేసుకున్నట్టు రీసెంట్ గా న్యూస్ వచ్చాయి. అయితే లేటెస్ట్ గా ఓ ఊహించని అప్డేట్ ఇచ్చింది మూవీ టీమ్.
అక్కినేని నాగేశ్వరరావు మనవడుగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీమ్. దశాబ్దం క్రితమే హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. ఇప్పటి వరకూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలమయ్యాడు సుశాంత్. ఆ మధ్య వచ్చిన చిలసౌ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నా.. ఆ విజయాన్ని కంటిన్యూ చేయడంలో తడబడ్డాడు. 2020లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన అల వైకుంఠపురములోతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ మారాడు. ఈ పాత్ర కూడా అతనికి పెద్దగా ప్లస్ కాలేదు. ఆ తర్వాత ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే మూవీతో మరోసారి హీరోగా వచ్చాడు. బట్ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని చూసింది. దీంతో రూట్ మార్చినట్టున్నాడు. హీరోఅనే కాకుండా ఏ పాత్రైనా ఓకే చేయాలనుకున్నట్టు తెలుస్తోంది. అందుకే రావణాసురలో కీలక పాత్రలో నటించేందుకు ఓకే చెప్పాడంటున్నారు.

Image
ఇక మూవీ నుంచి రిలీజ్ చేసిన అతని ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే విలన్ గానే నటిస్తున్నాడని అర్థమౌతోంది. సుశాంత్ చూడ్డానికి కూల్ బాయ్ లా ఉంటాడు. మరి విలన్ గా మెప్పించడం అంటే కొంత టఫ్ జాబ్. ఈ జాబ్ లో సక్సెస్ అయితే నటుడుగానూ ప్రూవ్ అవుతాడు. తర్వాత మరిన్ని అవకాశాలు వస్తాయి. ఏదేమైనా రవితేజ సినిమాలో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడన్న వార్త మాత్రం చాలామంది ఊహించనిది.

Image

Related Posts