రాజమౌళిపై మండిపడుతోన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ..

యస్ మీరు చదివింది కరెక్టే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు రాజమౌళిపై మండిపడుతున్నారు. అసలే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనే గుస్సాలో ఉన్నారు అభిమానులు. అలాంటి వారికి మరింత కోపం వచ్చేలా రాజమౌళి నిశ్శబ్దం కనిపించింది. నిజానికి ఈ సినిమాలో కథా పరంగా ఎన్టీఆర్ కు ఉన్న ప్రాధాన్యత ఏం లేదు. ప్రధాన కథ ఎక్కువగా రామ్ చరణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తుంది. అతని లక్ష్యానికి చిన్న పాటి సైనికుడులా కనిపించాడు ఎన్టీఆర్. ఈ విషయంలోనే అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ గొప్ప నటన చూపడం వల్ల కాస్త ఎలివేట్ అయ్యాడు కానీ.. లేదంటే అతని పాత్ర ‘సహాయ నటుడు’గా మిగిలిపోయి ఉండేది. ఇలాంటి సందర్భంలో ఓ కీలకమైన టైమ్ లో రాజమౌళి నిశ్శబ్దం వహించడం వారికి మండేలా చేసింది.
రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమా వెయ్యి కోట్లు కొల్లగొట్టిన సందర్భంలో ముంబైలో ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీమ్. ఈ ప్రెస్ మీట్ లో ముంబై నుంచి ఓ జర్నలిస్ట్ ఈ ప్రశ్నను నేరుగానే అడిగారు. ‘‘సినిమా మొత్తం రామ్ చరణ్ మీదుగానే సాగిపోయింది కదా.. దీనికి మీరేమంటారు..?’’ అని. దీనికి రామ్ చరణ్ వెంటనే రియాక్ట్ అయ్యాడు. అలాంటిదేం లేదనీ.. ఈ సినిమాలో ఇద్దరి పాత్రలూ గొప్పగానే ఉన్నాయని.. ఎన్టీఆర్ ఫెంటాస్టిక్ గా నటించాడు అని డిగ్నిఫైడ్ గా ఆన్సర్ చేశాడు. కానీ రాజమౌళి మాత్రం ఆ ప్రశ్నను పట్టించుకోలేదు. అంటే ఫ్యాన్స్ కోపం రీజనబుల్ అనేది ఒప్పుకున్నట్టే కదా.. అనేది వీరి వెర్షన్.
ఇద్దరు టాప్ యాక్టర్స్ తో మల్టీస్టారర్ చేసినప్పుడు అన్నీ బ్యాలన్స్ చేశాను అనుకున్న రాజమౌళి ఆ విషయంలో బ్యాలన్స్ తప్పాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తోంటే.. ఏకంగా ఆ ప్రశ్న అడిగిన జర్నలిస్ట్ కు కనీసం సమాధానం కూడా చెప్పుకుండా తమ హీరోను మరింత అవమానించాడని వారంతా కోపంతో రగిలిపోతున్నారు. మరి దీనికి రాజమౌళి నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందో కానీ.. నిజంగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కోపం న్యాయంగానే అనిపిస్తోందంటున్నారు.. చాలామంది.

Related Posts