మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం భోళా శంకర్. ఇది కోలీవుడ్ లో రూపొందిన వేదాళం మూవీకి రీమేక్. ఇందులో చిరంజీవి సరసన మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తుంటే.. చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ మూవీ ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటుంది. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
మహానటి సినిమాతో బాగా పాపులర్ అయిన కీర్తి సురేష్ ఈ సినిమాలో సిస్టర్ రోల్ చేస్తుండడం విశేషం. కోలీవుడ్ మూవీ అన్నాథై లో సూపర్ స్టార్ రజనీకాంత్ కి చెల్లెలి పాత్ర పోషించింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలు పాత్ర పోషిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే.. కీర్తిసురేష్ కి భర్త పాత్రలో యంగ్ హీరో నాగశౌర్యని ఎంపిక చేసినట్లు సమాచారం. మెగాస్టార్ సినిమా కావడంతోనే యంగ్ హీరో ఈ రోల్ ని ఒకే చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే.. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సివుంది. నాగశౌర్య హీరోగా నటించిన ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ ముఖ్య అతిథిగా వచ్చి ఆశీస్సులు అందించారు. ఆ వేదిక పై చిరంజీవి నాగశౌర్య యాక్టింగ్ గురించి మాట్లాడి ఎంతగానో మెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన సినిమాలో నటించే ఛాన్స్ ఇవ్వడం దక్కించుకోవడం విశేషం.