‘టిల్లు స్క్వేర్’ టీమ్ ను ప్రత్యేకంగా అభినందించిన మెగాస్టార్

ఇటీవలే వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ చిత్రం థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఫస్ట్ పార్ట్ ‘డీజే టిల్లు’కి మించిన రీతిలో కామెడీ హంగులతో రూపొందిన సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. లేటెస్ట్ గా ‘టిల్లు స్క్వేర్’ టీమ్ ను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. హీరో కమ్ రైటర్ సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాలో తన బెస్ట్ ఇచ్చాడని చెబుతూనే.. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ నాగవంశీ డైనమిజమ్ ను మెచ్చుకున్నారు. ఈ జనరేషన్ ప్రొడ్యూసర్స్ లో ది బెస్ట్ గా వంశీ దూసుకెళ్తున్నారని చిరంజీవి అన్నారు.

Related Posts