యంగ్ సెన్సేషన్ విజయ్ దేవర కొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ల కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ లైగర్. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావస్తోంది. తాజాగా ఈ చిత్రం అమెరికా షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్లో ప్రముఖ బాక్సర్ మైక్ టైషన్, విజయ్ దేవరకొండ, అనన్యపాండేలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఒక చిన్న షెడ్యూల్ మాత్రమే పెండింగ్ లో ఉంది. ఈ షెడ్యూల్ ని ఇండియాలో తెరకెక్కిస్తారు.
ఇదిలా ఉంటే.. ఈ రోజు అభిమానులకు డబుల్ సర్ఫ్రైజ్ ఇచ్చారు నిర్మాతలు. అది ఏంటంటే.. ఈ సినిమా 2022 ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఓ పోస్టర్ విడుదల చేశారు. అంతేకాదండోయ్.. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ను ఈనెల 31 విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ కొత్త సంవత్సరం.. మంట పుట్టిందాం అంటూ నిర్మాతలు జోష్ పెంచారు. బిగ్ స్క్రీన్ పై విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ నిజమైన యాక్షన్ ను చూసేందుకు అభిమానులు .. సినీ ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ నూతన సంవత్సరం గ్లిమ్స్ యాక్షన్ అభిమానులకు మంచి ట్రీట్ కానుంది.
పూరీ కనెక్ట్స్ తో కలిసి ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే.. రిలీజ్ డేట్ కు ఓ ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే.. విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ మూవీ అర్జున్ రెడ్డి కూడా 2017 ఆగస్ట్25నే విడుదలయ్యింది. నాలుగేళ్ల తర్వాత మళ్లీ అదే తేదీన లైగర్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. మరి.. విజయ్ కి అర్జున్ రెడ్డి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా..? ఆశించిన విజయాన్ని అందిస్తుందా..? అనేది చూడాలి.