ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ హీరోయిన్ రష్మిక జంటగా నటించిన భారీ చిత్రం పుష్ప. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో రూపొందిన పుష్ప చిత్రం డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే.. ఈ సినిమాలోని పాటలన్నీఒక ఎత్తు. సమంత చేసిన స్పెషల్ సాంగ్ మరో ఎత్తు. ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అంటూ సమంత చిందేసిన ఈ పాట యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
ఇప్పటికే ఈ సాంగ్ 45 మిలియన్స్కి పైగా వ్యూస్తో దూసుకెళుతుంది. సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. అయితే.. ఈ పాటతో పుష్ప పై మరింత క్రేజ్ వచ్చింది అనడంలో సందేహం లేదు. అయితే.. ఈ స్పెషల్ సాంగ్ కోసం ఎంత ఖర్చు పెట్టారు అనేది ఆసక్తిగా మారింది. ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే.. దాదాపుగా 5 కోట్లు ఖర్చుపెట్టారని తెలిసింది. ఈ 5 కోట్లల్లో సమంతకు దాదాపుగా కోటిన్నరకు పైగా రెమ్యూనరేషన్ ఇచ్చారని సమాచారం.
భారీ సెట్టింగ్ తో విజువల్ వండర్ అనేలా ఈ పాటను చిత్రీకరించారని.. ఈ స్పెషల్ సాంగ్ పుష్ప సినిమాకే హైలైట్ అవుతుందని అంటున్నారు. ఈ సాంగ్ పై కేసు పెట్టడంతో అసలు ఈ పాటలో ఏముంది అని వినే వాళ్లు ఎక్కువయ్యారు. ఈ విధంగా ఈ పాట మరింత పాపులర్ అవుతుంది.