తెలుగు భాషపై పట్టు సాధిస్తున్న జాన్వీ

దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లే ఓ ఊపు ఊపిన నటీమణుల్లో అతిలోక సుందరి శ్రీదేవి ముందు వరుసలో నిలుస్తోంది. శ్రీదేవి మాతృభాష తమిళం అనేవాళ్లున్నారు. అయితే.. ఒక సందర్భంలో శ్రీదేవి తన మాతృభాష తెలుగు అని చెప్పింది. ఇక.. శ్రీదేవి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని చిత్రపరిశ్రమలోకి ప్రవేశించిన ముద్దుగుమ్మ జాన్వీ. అమ్మ శ్రీదేవి తెలుగు నుంచి హిందీ చిత్రసీమకు వెళితే.. జాన్వీ మాత్రం హిందీ నుంచి తెలుగు సీమకు వస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందుతోన్న హై ఆక్టేన్ యాక్షన్ మూవీ ‘దేవర‘తో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది జాన్వీ కపూర్. ఈ సినిమాలో అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా తంగమ్ అనే పాత్రలో జాన్వీ కనిపించబోతుంది. అందుకోసం.. తెలుగు భాషను నేర్చుకోవడానికి తీవ్రంగా కసరత్తులు చేస్తుందట. కేవలం భాషను నేర్చుకోవడమే కాదు.. పల్లెటూరి పద్ధతులను ఔపోసాన పట్టే ప్రయత్నాలు చేస్తుందట. మొత్తంగా.. ‘దేవర‘లో తంగమ్ పాత్ర జాన్వీకి ఎంతో పేరు తీసుకురావడమే కాదు.. ఎన్నో అవార్డులను సైతం తీసుకొస్తుందని చిత్రబృందం చెబుతున్న మాట. ‘దేవర‘తో పాటు రామ్ చరణ్ 16వ సినిమాలోనూ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా తీసుకున్నారనే ప్రచారం ఉంది. ఈ చిత్రంలోనూ పల్లెటూరి తరహా పాత్రలోనే కనువిందు చేయనుందట జాన్వీ.

Related Posts