క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. ఇందులో ప్రభాస్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటించింది. ఈ భారీ పీరియాడిక్ లవ్ స్టోరీ కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు తెర పై చూస్తామా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దాదాపు రెండున్నర సంవత్సరాల గ్యాప్ తర్వాత ప్రభాస్ సినిమా థియేటర్లోకి వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో వస్తున్న రాధేశ్యామ్ ఏ స్థాయి విజయం సాధిస్తుందనేది ఆసక్తిగా మారింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో రూపొందిన ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్, తమన్ సంగీతాన్ని అందించారు.
అయితే… ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా ప్రమోషన్లలో దర్శకధీరుడు రాజమౌళి కూడా పాలు పంచుకున్నారు. ప్రభాస్, రాజమౌళి ఇంటర్ వ్యూకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఇంటర్ వ్యూలో ప్రభాస్ ఏం అడిగాడు..? రాజమౌళి ఏం చెప్పాడు..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. ఈ ఇంటర్ వ్యూను రిలీజ్ చేశారు. ఇందులో రాజమౌళిని ఆర్ఆర్ఆర్ మూవీలో నన్ను గెస్ట్ రోల్ గా అయినా పెట్టాలి అనిపించలేదా..? నేను, చరణ్, తారక్.. ముగ్గురం తెర పై కనిపిస్తే బాగుంటుంది కదా అని ప్రభాస్ రాజమౌళిని అడిగారు.
దీనికి రాజమౌళి స్పందిస్తూ… నువ్వు పెద్ద షిప్ లాంటోడివి. పెద్ద షిప్ పెడితే.. సీన్ బ్రహ్మాండంగా వస్తది అంటే.. షిప్ తీసుకువస్తాం.. నేను అడిగితే ప్రభాస్ వస్తాడు కాబట్టి ప్రభాస్ ని ఎక్కడ పెడదాం అనుకుంటే సినిమా బాగోదు.. సినిమాకి అవసరం అయితే.. ఎలాగైనా ఒప్పించి తీసుకువచ్చేస్తాను అని రాజమౌళి చెప్పారు. దీనికి ప్రభాస్.. మీకు నా కంటే చరణ్, తారక్ ఇష్టమని అర్థం అయ్యింది ఓకే అంటూ సరదాగా అనడం విశేషం.