మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇది రామ్ చరణ్ 15వ చిత్రం కాగా, దిల్ రాజుకు 50వ చిత్రం కావడం విశేషం. దీంతో ఈ భారీ చిత్రాన్ని దిల్ రాజు చాలా ప్రెస్టేజీయస్ గా తీసుకుని ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో నిర్మిస్తున్నారు. శంకర్ డైరెక్ట్ గా తెలుగులో చేస్తున్న సినిమా కావడం.. అలాగే ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. చరణ్.. మరి కొంత మంది ఫైటర్స్ పై కొన్ని యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించారు. ఇటీవల మూడవ షెడ్యూల్ చెన్నైలో ప్రారంభమైంది. రామ్ చరణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే… ఇటీవల ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ… చరణ్ – శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీని 2023 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు.
ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తుంది. అలాగే శ్రీకాంత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాలో చేయని విధంగా ఈ సినిమాలో శ్రీకాంత్ పాత్ర ఉంటుందని.. తమ సంస్థ నుంచి సంక్రాంతికి రిలీజ్ చేసిన సినిమాలు అన్నీ సక్సస్ అయ్యాయి. అలాగే వచ్చే సంవత్సరం సంక్రాంతికి రానున్న ఈ సినిమా కూడా ఖచ్చితంగా బిగ్ సక్సస్ అవుతుందని దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. మరి… చరణ్, శంకర్ కలిసి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.