సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ స్పోర్ట్స్ డ్రామా లైగర్. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాలో నటిస్తుండడంతో లైగర్ మూవీ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈమధ్య జరిగిన అమెరికా షెడ్యూల్ తో లైగర్ దాదాపుగా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అయితే… లైగర్ పై పుష్ప ఎఫెక్ట్ పడినట్టుగా తెలుస్తోంది.
ఇంతకీ విషయం ఏంటంటే… ఈ సినిమాలో ఓ ఐటం సాంగ్ ఉందట. ఈ ఐటం సాంగ్ ను ఇప్పటి వరకు ఐటం సాంగ్ చేయని హీరోయిన్ తో చేయించాలి అనుకుంటున్నారట. పుష్ప సినిమా కోసం.. అప్పటి వరకు ఐటం సాంగ్ చేయని సమంత చేసినట్టుగా. అలా… ఐటం సాంగ్ చేయని ఏ హీరోయిన్ అయితే బాగుంటుందా అని పూరి అండ్ టీమ్ ఆలోచనలోపడిందట.
ఆతర్వాత పుష్ప సినిమాలో ఐటం సాంగ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన సమంతే అయితే… బాగుంటుంది అనే నిర్ణయానికి వచ్చారట.
సమంతను పూరి అండ్ టీమ్ కాంటాక్ట్ చేశారని టాలీవుడ్ లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. అయితే… సమంత తన నిర్ణయాన్ని మాత్రం ఇంకా చెప్పలేదట. సమంత ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ మూవీస్ చేస్తూ.. ఫుల్ బిజీగా ఉంది. ఇంకా చెప్పాలంటే… మూడు సంవత్సరాల వరకు డేట్స్ ఖాళీగా లేవట. మరి.. ఇలాంటి పరిస్థితుల్లో లైగర్ మూవీ కోసం ఐటం సాంగ్ చేసేందుకు ఊ.. అంటుందో..? ఊ..ఊ.. అంటుందో.? అనేది ఆసక్తిగా మారింది. మరి.. క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.