మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత దూకుడు పెంచారు. వరుసగా సినిమాలు చేస్తూ.. యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తున్నారు. ఆచార్య సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే.. చిరంజీవి చేస్తున్న మరో సినిమా భోళా శంకర్. మెహర్ రమేష్ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఇది సాలిడ్ మాస్ మసాలా డ్రామా.
తమిళ్ లో అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమాకి ఇది రీమేక్. తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. అయితే.. ఈ కొత్త సంవత్సరం కానుకగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్ డేట్ ను ఇస్తున్నట్టుగా తెలిపారు. మరి దాన్ని ఈ రోజు మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చే విధంగా రివీల్ చేశారు. భోళా శంకర్ మాస్ స్వాగ్ అంటూ కట్ చేసిన ఈ చిన్న వీడియో క్లిప్ ఎగ్జైటింగ్ గా అదిరింది అనేలా ఉందని చెప్పాలి.
ఈ వీడియోతో తెలిసింది ఏంటంటే.. ఈ సినిమాలో చిరంజీవి సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నారని. తనకు చిరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ఈ కథ పై బాగా కసరత్తు చేశారట డైరెక్టర్ మెహర్ రమేష్. ఇందులో చిరంజీవి సరసన తమన్నా నటిస్తుంటే.. చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది. మరి.. ఈ సినిమాతో మెహర్ రమేష్ సక్సస్ సాధించి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.