అల్లు అర్జున్ భారీ మల్టీస్టారర్

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తన రేంజ్ ను పెంచుకుంటూనే ఉన్నాడు. ఇప్పటికే ఏ పెద్ద దర్శకుడి హెల్ప్ లేకుండా ప్యాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడు. వైవిద్యమైన కథలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. పుష్పతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఐకన్ స్టార్ ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నాడు.

అలాగే పుష్పను రష్యాలో రిలీజ్ చేస్తున్న సందర్భంగా అక్కడ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడిప్పుడు. అయితే పుష్ప కంటే ముందే వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో అతను ఐకన్ అనే సినిమాకు కమిట్ అయి ఉన్నాడు. బట్ ఆ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టి పుష్ప చేశాడు.

తను ఊహించినట్టుగానే అద్బుత విజయం అందుకున్నాడు. అయితే ఈ మూవీ తర్వాత ఏంటీ అనే ప్రశ్నకు మాత్రం ఆన్సర్ ఇప్పటి వరకూ రాలేదు. అయితే అల్లు అర్జున్ కావాలనే ఇలా కొత్త సినిమా విషయంలో ఓ గోప్యత పాటించాడని లేటెస్ట్ గా వస్తోన్న వార్తలు చూస్తే తెలుస్తోంది.


ఎవరూ ఊహించని కాంబినేషన్ లో అల్లు అర్జున్ ఓ భారీ మల్టీస్టారర్ చేయబోతున్నాడు. అది కూడా బాలీవుడ్ లో. యస్.. ఈ వార్త కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. యేడాది క్రితం అల్లు అర్జున్ ఓ పి ఆర్ టీమ్ ను ముంబైలో పెట్టాడు అనే వార్తలు గుర్తున్నాయా..? ఆ పిఆర్ ఫలితమే ఈ భారీ సినిమా. ఈ చిత్రాన్ని ఊరమాస్ చిత్రాల దర్శకుడు రోహిత్ శెట్టి చేయబోతున్నాడు.

రోహిత్ శెట్టి అంటే బాలీవుడ్ వినాయక్ లాంటోడు. యాక్షన్ తో పాటు ఎంటర్టైన్మెంట్స్ లోనూ బెస్ట్ అనిపించుకున్నాడు. అతనే అల్లు అర్జున్ తో పాటు మరో ఇద్దరు హీరోలతో భారీ మల్టీస్టారర్ కు ప్లాన్ చేశాడు. ఇప్పటికే కథ పూర్తయిందట. అర్జున్ రష్యా నుంచి రాగానే పూర్తి కథను వింటాడు. ఇతను సరే.. మిగతా ఇద్దరు హీరోలెవరూ అంటే.. ఒకర్ రణ్‌వీర్ సింగ్, మరొకరు తమిళ్ స్టార్ కార్తీ. ఈ పేర్లు వినగానే ఇదో క్రేజీ మల్టీస్టారర్ కూడా అనిపిస్తోంది కదూ. మరో విశేషం ఏంటంటే.. ఈ మూవీలో రోహిత్ ఆస్థాన హీరోలైన అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గణ్ గెస్ట్ రోల్స్ చేయబోతున్నారు.


ఈ ముగ్గురు హీరోలు కూడా పోలీస్ ఆఫీసర్స్ గా ఉంటారు అనే టాక్ తో పాటు రణ్‌వీర్ సింగ్, కార్తీ పోలీస్ లుగా.. వారు వెదికే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు అనే టాక్స్ కూడా ఉన్నాయి. మొత్తంగా అల్లు అర్జున్ సైలెంట్ గా సునామీ క్రియేట్ చేసేందుకు సన్నద్ధంగా ఉన్నాడన్నమాట.

Related Posts